యాప్నగరం

క్వెట్టా పోలింగ్ స్టేషన్ ముందు పేలుడు.. 25 మంది మృతి, 40 మందికి గాయాలు

ఎన్నికల వేళ పాకిస్థాన్ నెత్తురోడింది. బలోచిస్థాన్‌లోని క్వెట్టాలో పోలింగ్ బూత్ ముందు జరిగిన ఆత్మాహుతి దాడిలో 25 మంది మరణించగా, 40 మందికిపైగా గాయపడ్డారు.

Samayam Telugu 25 Jul 2018, 12:50 pm
ఎన్నికల వేళ పాకిస్థాన్ నెత్తురోడింది. బలోచిస్థాన్‌లోని క్వెట్టాలో పోలింగ్ బూత్ ముందు జరిగిన ఆత్మాహుతి దాడిలో 25 మంది మరణించగా, 40 మందికిపైగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో ముగ్గురు పోలీసులు, ఇద్దరు పిల్లలు కూడా ఉణ్నారు. పెట్రోలింగ్‌లో పోలీస్ వాహనం సమీపంలో పేలుడు జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పోలింగ్ బూత్‌లోకి వెళ్లడానికి సూసైడ్ బాంబర్ ప్రయత్నించాడని, భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో తనను తాను పేల్చుకున్నాడని పోలీసు అధికారి ఒకరు చెప్పారు.
Samayam Telugu quetta blast1


గాయపడిన వారిని సందేమన్ ప్రావిన్సియల్ హాస్పిటల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నామని డీఐజీ అబ్దుల్ రజాక్ చీమా తెలిపారు. హాస్పిటల్ పరిసరాల్లో అత్యవసర పరిస్థితిని విధించారు. ఎన్నికల కారణంగా మంగళవారమే అప్ఘాన్, బలోచిస్థాన్ సరిహద్దును పాకిస్థాన్ మూసివేసింది.

పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలోని 272 స్థానాల కోసం దేశవ్యాప్తంగా ఉదయం 8 గంటలకే ఓటింగ్ ప్రారంభమైంది. 85 వేల పోలింగ్ బూత్‌లలో పది కోట్ల మందికిపైగా ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ ఎన్నికల కోసం పాకిస్థాన్ ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. 4 లక్షల మంది పోలీసులు, 371,388 సైనికులు పోలింగ్ కేంద్రాల వద్ద పహారా కాస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.