యాప్నగరం

అమెరికాలో మళ్లీ కాల్పులు.. ఐదుగురి దుర్మరణం

దోపిడీకి యత్నించిన ఓ సాయుధుడు తనను అడ్డుకునే యత్నం చేసిన వ్యక్తులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.

Samayam Telugu 24 Jan 2019, 9:49 am
గన్ కల్చర్ ఉన్న అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. ఫ్లోరిడా రాష్ట్రంలోని ఓ బ్యాంకులో దోపిడీకి యత్నించి ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఐదుగురు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటనలో గాయపడ్డ వారికి చికిత్స అందిస్తున్నారు. ఫ్లోరిడా పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. సెబ్రింగ్‌ నగరంలోని సన్‌ ట్రస్ట్‌ బ్యాంకులోకి బుధవారం మధ్యాహ్నం ప్రవేశించిన దుండగుడు కొంత సమయం తర్వాత ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు.
Samayam Telugu Bank


నిమిషాల వ్యవధిలో విచక్షణారహితంగా బ్యాంకులో ఉన్న వారిపై కాల్పులు జరిపాడు. దీంతో ఐదుగురు పౌరులు అక్కడికక్కడే మృతిచెందారు. కాల్పులు జరిపిన అనంతరం దుండగుడు పరారయ్యాడు. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ పరిశీలించి నిందితుడిని సెబ్రింగ్‌కు చెందిన 21 ఏళ్ల జీపెన్‌ జావర్‌గా గుర్తించారు. కొన్ని గంటల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.