యాప్నగరం

ఐరాస ఎదుట బెలూచ్ ఉద్యమకారుల ప్రదర్శన

పాకిస్థాన్ కు వ్యతిరేకంగా బెలూచిస్థాన్ ఉద్యమకారులు ఐక్యరాజ్యసమితి ఎదుట నిరసన తెలిపారు.

TNN 14 Sep 2016, 6:49 pm
తమ భూభాగం నుండి పాకిస్థాన్ వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తూ బెలూచిస్థాన్ ఉద్యమకారులు న్యూయాార్కులోని ఐక్యరాజ్యసమితి ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. తమ భూభాగాన్ని పాకిస్థాన్ తక్షణమే ఖాళీ చేసి వెళ్లాలంటూ నినాదాలు చేశారు. అక్రమంగా బెలూచిస్థాన్ ను ఆక్రమించుకున్న పాకిస్థాన్ తమకు చెందిన సహజ వనరులను దోచుకుంటోందని ఆరోపించారు. చైనాకు తమ ప్రాంతాన్ని ధారాదత్తం చేయడాన్ని నిరసించారు. చైనాకు, పాకిస్థాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తన ఆగస్టు పదిహేను నాటి ప్రసంగంలో ప్రధాని మోడీ బెలూచిస్థాన్ పోరాటాన్ని ప్రస్తావించిననాటి నుండి బెలూచిస్థాన్ ఉద్యమకారులు తమ పోరును ముమ్మరం చేయడం విశేషం. బెలూచిస్థాన్లో పాక్ సేనలు పెద్ద ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నాయని, ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవాలని నినదించారు. ఈ సందర్భంగా వారు భారతదేశానికి అనుకూలంగా నినాదాలు చేశారు. భారత్-బెలూచిస్థాన్ ఫ్రెండ్ షిప్ వర్ధిల్లాలని స్లోగన్లిచ్చారు.
Samayam Telugu baloch activists gathered outside the united nations headquarters in new york city
ఐరాస ఎదుట బెలూచ్ ఉద్యమకారుల ప్రదర్శన

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.