యాప్నగరం

బీపీ మాత్రలతో కరోనాకు చెక్.. గణనీయంగా తగ్గుతున్న మరణాలు!

హై బీపీ సమస్యను తగ్గించడం కోసం వాడే మందులు కరోనా కారణంగా మరణించే ముప్పును 33 శాతం తగ్గిస్తున్నట్లు బ్రిటన్ పరిశోధకులు గుర్తించారు.

Samayam Telugu 24 Aug 2020, 12:15 pm
కరోనా వైరస్‌కు ఇప్పటి వరకు మందు కనుగొనలేదు. ప్రపంచవ్యాప్తంగా అనేక వ్యాక్సిన్లు కీలక ప్రయోగ దశలో ఉన్నాయి. వ్యాక్సిన్‌ను కనుగొన్నామని రష్యా ప్రకటించినప్పటికీ.. దానిపై అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్-19పై కొన్ని రకాల మందులు ఆశాజనకమైన పనితీరు కనబరుస్తుండటం ఊరటనిస్తోంది. బ్రిటన్‌లో హై బీపీ కోసం వాడే మందులు కరోనా కారణంగా మరణించే ముప్పును 33 శాతానికిపైగా తగ్గిస్తున్నాయని పరిశోధనలో వెల్లడైంది.
Samayam Telugu blood pressure


యాంజియోటెన్సిన్- కన్వర్టింగ్ ఎంజైమ్ (ఏసీఈ), యాంజియోటెన్సిన్ రిసెపర్టర్ బ్లాకర్స్ (ఏఆర్‌బీ) అనే మందులను హైబీపీ, హార్ట్ ఎటాక్, డయాబెటిస్ కోసం వాడుతుంటారు. ఈ మందులు వేసుకున్న వారిలో కరోనా కారణంగా చనిపోయే ముప్పు గణనీయంగా తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు.

కోవిడ్-19 హాస్పిటల్‌లో 28,872 మంది పేషెంట్ల వివరాలను పరిశీలించిన యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఎంజిలా పరిశోధకులు ఈ వివరాలను వెల్లడించారు. కరోనా చికిత్సలో భాగంగా హై బీపీ లేని వారు ఈ ఔషధాలను సైతం వేసుకోవచ్చా అనే దిశగా మరింతగా పరిశోధనలు చేయాల్సి ఉందన్నారు.

Read Also: భర్త ఇచ్చిన తొలి గిఫ్ట్.. 26 ఏళ్ల తర్వాత తిరిగి ఆమె చెంతకు

డయాబెటిస్, కిడ్నీ ఫెయిల్యూర్ లాంటి సమస్యలతో బాధపడుతున్న పేషెంట్లు ఏసీఈ, ఏఆర్‌బీలను వాడినప్పుడు వారిలో కరోనా తీవ్రత తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. కరోనా రాక ముందు నుంచి ఈ మందులు వాడుతున్న వారిలో కోవిడ్ ప్రభావం తక్కువగా ఉంది కానీ.. కరోనా వచ్చాక వేసుకుంటే వైరస్ ప్రభావం తక్కువగా ఉందని చెప్పడానికి ఆధారాల్లేవని పరిశోధకులు తెలిపారు.

Must Read: తగ్గుతారా.. యుద్ధం మొదలుపెట్టాలా... చైనాకు భారత్ వార్నింగ్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.