పర్యాటకుల పడవ మునిగిపోయిన ఘటనలో 13 మంది మృతి చెందారు. మరో 15 మంది గల్లంతయ్యారు. అమెరికాలోని మిస్సౌరిలో ఈ విషాదం చోటుచేసుకుంది. గల్లంతైన వారి కోసం అధికారులు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. మిస్సోరిలోని టేబుల్ రాక్ లేక్లోకి ప్రతికూల వాతావరణంలో పర్యాటకులతో కూడిన బోటు వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. తుఫాన్ కారణంగా బలమైన గాలులు వీయడంతో పడవ కు దుపునకు లోనై మునిగిపోయినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పడవ మునక.. 13 మంది మృతి
పర్యాటకుల పడవ మునిగిపోయిన ఘటనలో 13 మంది మృతి చెందారు. మరో 15 మంది గల్లంతయ్యారు. అమెరికాలోని మిస్సౌరిలో ఈ విషాదం చోటుచేసుకుంది. గల్లంతైన వారి కోసం అధికారులు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు.
Samayam Telugu 20 Jul 2018, 7:11 pm