యాప్నగరం

మసీదులో ప్రార్థనలు లక్ష్యంగా పేలుళ్లు.. 62 మంది మృతి

మసీదులో సంభవించిన పేలుళ్లలో 62 మంది దుర్మరణం పాలయ్యారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. తూర్పు అఫ్గానిస్థాన్‌లోని ఓ మసీదులో ఈ విషాదం చోటు చేసుకుంది.

Samayam Telugu 18 Oct 2019, 10:09 pm
శుక్రవారం సందర్భంగా మసీదులో ప్రార్థనలు చేస్తున్న వారిని లక్ష్యంగా చేసుకొని జరిపిన బాంబు పేలుళ్లు భారీ ప్రాణ నష్టాన్ని మిగిల్చాయి. తూర్పు ఆఫ్గానిస్థాన్‌లోని ఓ మసీదులో సంభవించిన ఈ పేలుడులో 62 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. పేలుడుకు తాలిబన్‌, ఇస్లామిక్ స్టేట్‌ గ్రూప్ సంస్థల్లో ఒకటి కారణమని భావిస్తున్నారు.
Samayam Telugu Masjid


పేలుడు దాటికి మసీదు రక్తసిక్తమైంది. మృతదేహాలు, తెగిపడిన శరీర భాగాలతో ఘటనా స్థలి భయానకంగా మారింది. పేలుళ్లకు సంబంధించి రెండు విరుద్ధ వార్తలు వినిపిస్తున్నాయి. మసీదులో ప్రార్థన చేసేవారిని లక్ష్యంగా చేసుకొని రెండు బాంబులను అమర్చి ఏకకాలంలో పేల్చివేశారని కొంత మంది అధికారులు చెబుతుండగా.. ప్రార్థనలు చేస్తున్న వారిపై ఓ దుండగుడు ఆత్మాహుతి దాడి చేశాడని మరికొంత మంది చెబుతున్నారు.

Also Read: తాత్కాలిక డ్రైవర్ అఘాయిత్యం.. మహిళా కండక్టర్‌పై బస్సులోనే అత్యాచార యత్నం

అఫ్గానిస్థాన్‌లో హింస తారాస్థాయికి చేరిందని.. జులై నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో వందలాది మంది సామాన్య ప్రజలు మరణించారని ఐక్యరాజ్య సమితి ప్రకటించిన మరుసటి రోజే ఈ పేలుడు సంభవించడం గమనార్హం. జులై నుంచి సెప్టెంబర్‌ మధ్యలో అఫ్గాన్‌లో 1174 మంది మరణించగా.. 3139 మంది గాయపడ్డారు. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే ఇది 42 శాతం ఎక్కువ అని ఐరాస ఓ నివేదికలో పేర్కొంది.

Photos Credit: Twitter, Farzana Shah

Also Read: దొర గారు రోడ్డు మార్గంలో వెళ్లొచ్చుగా.. మతలబు వేరే ఉంది: విజయశాంతి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.