బ్రెజిల్లోని మనాస్ నగరంలో గల అమెజాన్ జంగిల్ సిటీ జైలులో ఖైదీల మధ్య తలెత్తిన ఘర్షణలో 60 మంది ఖైదీలు మృతిచెందారు. రెండు వేర్వేరు డ్రగ్ ముఠాల మధ్య వున్న ముఠా తగాదాలే ఈ ఘర్షణకు కారణంగా తెలుస్తోంది. ఆదివారం రాత్రి పొద్దుపోయాకా మొదలైన ఘర్షణ సోమవారం తెల్లవారుజామున 7 గంటల వరకు జరిగినట్టు జైలు అధికారవర్గాలు తెలిపాయి. ఘర్షణ అనంతరం కొంతమంది ఖైదీల శవాల్ని గోడ అవతలకి విసిరేసినట్టు సమాచారం. ఇంకొంత మంది ఖైదీలు జైలు నుంచి పరారయ్యారు.
అమెజానస్ స్టేట్ సెక్యురిటీ చీఫ్ సర్జియో ఫాంటెస్ మాట్లాడుతూ... మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం వుందని అన్నారు. జైలు నుంచి ఎంతమంది పారిపోయారు, ఇంకెంత మంది లోపల వున్నారు అనే గణాంకాల్ని జైలు అధికారవర్గాలు పరిశీలిస్తున్నట్టు ఫాంటెస్ తెలిపారు.
ఇదిలావుంటే, బ్రిజిల్లో జైలు నిర్వహణ వ్యవస్థపై అంతర్జాతీయ భద్రతా సంస్థలు తరచుగా విమర్శలు వ్యక్తంచేస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా జైళ్లలో అత్యధిక సంఖ్యలో ఖైదీలు ఉండటం వల్ల తరచుగా అల్లర్లు జరుగుతున్నాయని అంతర్జాతీయ భద్రతా సంస్థలు ఆరోపిస్తున్నాయి.
అమెజాన్ నది తీరంలో వున్న ఈ సిటీలోని జైలులో గతంలో అనేకసార్లు డ్రగ్ ముఠాల మధ్య ఘర్షణలు జరిగాయని... అయితే, ఈసారి జరిగిన అల్లర్లలో 12 మంది జైలు గార్డులని కూడా ఖైదీలు బంధీలుగా తీసుకుని కాల్పులకి పాల్పడ్డారని గ్లోబో టీవీ కథనం వెల్లడించింది. బ్రెజిల్ లోనే అతి పెద్ద పారిశ్రామిక నగరంగా మనాస్ కి పేరుంది.
అమెజానస్ స్టేట్ సెక్యురిటీ చీఫ్ సర్జియో ఫాంటెస్ మాట్లాడుతూ... మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం వుందని అన్నారు. జైలు నుంచి ఎంతమంది పారిపోయారు, ఇంకెంత మంది లోపల వున్నారు అనే గణాంకాల్ని జైలు అధికారవర్గాలు పరిశీలిస్తున్నట్టు ఫాంటెస్ తెలిపారు.
ఇదిలావుంటే, బ్రిజిల్లో జైలు నిర్వహణ వ్యవస్థపై అంతర్జాతీయ భద్రతా సంస్థలు తరచుగా విమర్శలు వ్యక్తంచేస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా జైళ్లలో అత్యధిక సంఖ్యలో ఖైదీలు ఉండటం వల్ల తరచుగా అల్లర్లు జరుగుతున్నాయని అంతర్జాతీయ భద్రతా సంస్థలు ఆరోపిస్తున్నాయి.
అమెజాన్ నది తీరంలో వున్న ఈ సిటీలోని జైలులో గతంలో అనేకసార్లు డ్రగ్ ముఠాల మధ్య ఘర్షణలు జరిగాయని... అయితే, ఈసారి జరిగిన అల్లర్లలో 12 మంది జైలు గార్డులని కూడా ఖైదీలు బంధీలుగా తీసుకుని కాల్పులకి పాల్పడ్డారని గ్లోబో టీవీ కథనం వెల్లడించింది. బ్రెజిల్ లోనే అతి పెద్ద పారిశ్రామిక నగరంగా మనాస్ కి పేరుంది.