యాప్నగరం

గోవా వేదికగా బ్రిక్స్ దేశాల సదస్సు ప్రారంభం

గోవాలో ప్రారంమైన బ్రిక్స్ దేశాల సదస్సుకు ప్రధాని మోడీ సహా వివిధ దేశాల ప్రతినిధుల హాజయ్యారు.

TNN 15 Oct 2016, 2:28 pm
గోవా వేదికగా బ్రిక్స్ దేశాల సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సులో భారత్ తో పాటు చైనా, రష్యా, బ్రెజిల్,సౌత్ ఆఫ్రికా తదితర దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. రెండు రోజులు పాటు జరిగే ఈ సదస్సులో ఆయా దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలు.. దానికి పరిష్కార మార్గాలపై దృష్టి సారించనున్నాయి. ఇదేవేదికపై.. ఆర్థికావృద్ధికి ఉగ్రవాదంపెనుముప్పుగా పరిగణిస్తోందని వాదిస్తూ పాక్ పై దౌత్య దాడి చేయాలని భారత్ భావిస్తోంది. ఉగ్రవాద నియంత్రణపై బ్రిక్స్‌ దేశాల మధ్య సహకారం విస్తరించుకోవాలని భారత్‌ కోరనుంది.
Samayam Telugu brics summit 2016 start
గోవా వేదికగా బ్రిక్స్ దేశాల సదస్సు ప్రారంభం





ఇదిలా ఉండగా బ్రిక్స్ సదస్సు సందర్భంగా గోవా పరిసర ప్రాంతాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. బాంబ్ స్క్వాడ్ టీంలు క్షుణ్ణంగా పరిశలీంచిన తర్వాతే ప్రతినిధులను లోనికి అనుమతి ఇస్తున్నారు..సదస్సు ప్రాంగణంలో బ్రిక్స్ ప్రతినిధులను తప్పితే ఎవరినీ అనుమించడం లేదు. సార్క్ దేశాల సదస్సు‌ను భారత్ అడ్డుకుందనే అక్కసుతో ఉన్న పాక్.. బ్రిక్స్ సదస్సులో ఉగ్రవాదులను ఉసిగొల్పే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో బ్రిక్స్ సదస్సు జరిగే పరిసర ప్రాంతంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.