యాప్నగరం

రన్‌వే పక్కన ల్యాండింగ్.. ఇంట్లోకి దూసుకెళ్లిన విమానం, 15 మంది మృతి

ప్రతికూల వాతావరణం కారణంగా పైలట్ పొరబడటంతో ఓ విమానం రన్‌వేకు పక్కక దిగి నివాస భవనంలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో 15 మంది దుర్మరణం పాలయ్యారు.

Samayam Telugu 14 Jan 2019, 10:23 pm
రాన్‌ రాజధాని టెహ్రాన్‌లో సైన్యానికి చెందిన ఓ విమానం కూలిన ఘటనలో 15 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రతికూల వాతావరణం కారణంగా పైలట్ పొరబడటంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. పొగమంచు కారణంగా రన్‌వే సరిగా కనిపించకపోవడంతో.. పైలట్ నిరూపయోగంగా ఉన్న మరో రన్‌వేపై దించాడు. అది నేరుగా నివాస భవనాల్లోకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. ఓ ఇంటిని ఢీకొట్టి పేలిపోయింది. దీంతో 15 మంది అక్కడికక్కడే మృతిచెందారు. అయితే.. విమాన స్క్రూ సిబ్బందిలో ఒకరు ప్రమాదం నుంచి నాటకీయంగా బయటపడ్డారు.
Samayam Telugu Iran plane crash


ఇరాన్ మీడియా కథనం ప్రకారం ప్రమాదం జరిగిన సమయంలో బోయింగ్ 707 విమానంలో 16 మంది ఉన్నారు. సైన్యానికి చెందిన ఆ కార్గో విమానం.. మాంసం సరఫరా చేసేందుకు కిర్గిస్థాన్‌ రాజధాని బిషెక్‌ నుంచి టెహ్రాన్‌కు వస్తోంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించక పైలట్‌ మరో రన్‌వేపై విమానాన్ని దించడంతో పక్కనే ఉన్న భవనాన్ని ఢీకొట్టి మంటల్లో కాలిపోయింది.


సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సాహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హెలికాప్టర్‌, అంబులెన్స్‌తో సహాయక చర్యలు చేపట్టారు. విమానం కూలిన ప్రదేశంలో భారీ ఎత్తున పొగ వ్యాపించింది. ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.