యాప్నగరం

తీరు మార్చుకోని చైనా సైన్యం

గతంలో అనేక సార్లు భారత భూభాగంలోకి చొరబడిన చైనా పీపుల్ లిబర్ ఆర్మీ మళ్లీ దుస్సాహసానికి తెగబడింది.

TNN 14 Jun 2016, 4:37 pm
కొద్ది కాలంగా ప్రశాంతంగా ఇండో-చైనా సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తకర పరిస్థితులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో అనేక సార్లు భారత భూభాగంలోకి చొరబడిన చైనా పీపుల్ లిబర్ ఆర్మీ మళ్లీ దుస్సాహసానికి తెగబడింది. నాలుగు రోజుల క్రితం పీఎల్ఏకి చెందిన 250 మంది సైనికులు అరుణాచల్ ప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌లోకి ప్రవేశించారు. వారు మూడు గంటలపాటు భారత భూభాగంలోనే ఉన్నారని తెలుస్తోంది. కమెంగ్ జిల్లాలోకి చైనా సైన్యం దూసుకొచ్చిందని భారత ర‌క్ష‌ణ‌ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయాన్ని చైనా విదేశాంగ శాఖ అంగీకరించలేదు. న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్‌లో భారత్ సభ్యత్వాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకించిన రోజునే ఆ దేశ సైన్యం మన భూభాగంలోకి అడుపెట్టింది. ఈ ప్రాంతంలోకి చైనా సైన్యం చొరబడటం ఈ ఏడాదిలో ఇది రెండోసారి.
Samayam Telugu china army entered into arunachal
తీరు మార్చుకోని చైనా సైన్యం

గత మార్చిలో లడఖ్ ప్రాంతంలోని పాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యాంగ్ సరస్సు ప్రాంతంలో చైనా బలగాలు ఆరు కిలోమీటర్ల మేర భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చాయి. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ వారిని వెనక్కి తిప్పి పంపారు. అరుణాచల్ ప్రదేశ్‌‌‌‌‌‌‌లోని 90 వేల చదరపు కి.మీ., జమ్మూ కశ్మీర్లో భాగమైన లడఖ్‌లో 38 వేల చ.కి.మీ. ప్రాంతం తమ పరిధిలోకి వస్తుందని చైనా వాదిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.