ఓవైపు ఎక్కువ మంది పిల్లలను కనాలని ప్రోత్సహిస్తున్న చైనా.. మరోవైపు, ముస్లింలు, ఇతర మైనార్టీల్లో జననాల రేటును అరికట్టేందుకు కఠిన చర్యలను అవలంభిస్తోంది. అసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ) పరిశోధన ప్రకారం.. బలవంతపు జనన నియంత్రణ గురించి మహిళలు ఇంతకు ముందే మాట్లాడినప్పటికీ, ఈ పద్ధతి గతంలో కంటే చాలా విస్తృతంగా, క్రమబద్ధంగా ఉంది. గణాంకాలు, ప్రభుత్వ పత్రాలు, 30 మంది మాజీ ఖైదీలు, కుటుంబసభ్యులు, నిర్బంధంలో తీసుకున్న పలువురు కార్యకర్తలను సంప్రదించి ఇంటర్వ్యూల ఆధారంగా నివేదికను రూపొందించింది.
జిన్జియాంగ్ పశ్చిమ ప్రాంతంలో గత నాలుగేళ్లుగా చేసిన ప్రచారాన్ని కొంతమంది నిపుణులు ‘జనాభా మారణహోమం’ అని పిలుస్తున్నారు. క్రమం తప్పకుండా మైనారిటీ మహిళలకు గర్భధారణ తనిఖీలు చేయడం.. బలవంతపు గర్భనిరోధక పద్దతులు, స్టెరిలైజేషన్తోపాటు వందల వేల మందికి అబార్షణలను బలవంతంగా చేస్తున్నట్టు ఇంటర్వ్యూలు, డేటా వెల్లడిస్తున్నాయి.
సామూహిక నిర్బంధం, జనాభా నియంత్రణ చర్యలను పాటించడంలో విఫలమైతే శిక్షలు, బెదిరింపులు వంటి దాష్టీకాలకు పాల్పడుతోంది. ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారిని నిర్బంధ శిబిరాలకు తరలిస్తున్నట్టు ఏపీ గుర్తించింది. ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలున్న తల్లిదండ్రులను వారి కుటుంబాలకు దూరంగా ఉంచడం.. భారీగా జరిమానా విధించడం చేస్తున్నారు. అలాగే, పిల్లల్ని దాచిపెట్టారేమోనన్న అనుమానంతో ఇళ్లపై పోలీసులు దాడిచేసి, తల్లిదండ్రులను భయపెడుతుంటారు.
ముగ్గురు పిల్లలున్నారనే కారణంతో కజికిస్థాన్ సంతతి చైనా మహిళ గుల్నార్ ఒమిర్జఖ్కు గర్బోనిరోధక లూప్ వేయించాలని ప్రభుత్వం ఆదేశించింది. రెండేళ్ల తరువాత జనవరి 2018లో మిలటరీ అధికారులమంటూ నలుగురు ఇంటికొచ్చి భర్తను అదుపులోకి తీసుకున్నారు. కూరగాయల వ్యాపారం చేసుకుని జీవనం సాగించే వారికి ఇద్దరు కంటే ఎక్కువ మంది సంతానం ఉన్నారని, 2,685 డాలర్ల జరిమానా మూడు రోజుల్లో చెల్లించాలని ఆదేశించారు. అలా చెల్లించకపోతే భర్తను ఇతర జాతి మైనారిటీల నిర్బంధ శిబిరంలో బంధిస్తామని హెచ్చరించారు.
మైనార్టీల జననాల రేటు నియంత్రణకు చేపట్టిన చర్యలు భయాందోళనలకు గురిచేస్తున్నాయని పలువురు బాధితుల మాటల్లో వెల్లడయ్యింది. ఉయ్ఘుర్ ముస్లింలు ఉండే హోటన్, కస్గర్ ప్రాంతంలో 2015 నుంచి 2018 మధ్య జననాల రేటు 60 శాతం మేర తగ్గిపోయింది. జిన్జియాంగ్ ప్రాంతంలోనూ జననాల రేటు క్షీణించింది. జాతీయ స్థాయి సగటు 4.2 శాతంతో పోలిస్తే ఇక్కడ 24 శాతం మేర తగ్గిపోయినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
జననాల రేటు అత్యంత వేగంగా ఉండే జిన్జియాంగ్ ప్రావిన్సుల్లో మైనార్టీ జనాభా వృద్ధిచెందకుండా వందల నుంచి మిలియన్ల డాలర్లను చైనా ప్రభుత్వం కుమ్మరిస్తోంది.. దీంతో కొన్నేళ్లుగా అక్కడ జననాల రేటు మందగించిందని అసోసియేట్ ప్రెస్ పరిశోధనలో నిగ్గుతేలింది. ఈ రకమైన తగ్గుదల ఆశ్చర్యకరమని.. దీని వెనుక క్రూరత్వం ఉందని చైనాలో మైనారిటీ హక్కుల ఉద్యమకారుడు జెంజ్ అన్నారు. ఇది ఉయ్ఘర్లను లొంగదీసుకునే విస్తృత నియంత్రణ ప్రచారంలో భాగమని వ్యాఖ్యానించారు.
జిన్జియాంగ్ పశ్చిమ ప్రాంతంలో గత నాలుగేళ్లుగా చేసిన ప్రచారాన్ని కొంతమంది నిపుణులు ‘జనాభా మారణహోమం’ అని పిలుస్తున్నారు. క్రమం తప్పకుండా మైనారిటీ మహిళలకు గర్భధారణ తనిఖీలు చేయడం.. బలవంతపు గర్భనిరోధక పద్దతులు, స్టెరిలైజేషన్తోపాటు వందల వేల మందికి అబార్షణలను బలవంతంగా చేస్తున్నట్టు ఇంటర్వ్యూలు, డేటా వెల్లడిస్తున్నాయి.
సామూహిక నిర్బంధం, జనాభా నియంత్రణ చర్యలను పాటించడంలో విఫలమైతే శిక్షలు, బెదిరింపులు వంటి దాష్టీకాలకు పాల్పడుతోంది. ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారిని నిర్బంధ శిబిరాలకు తరలిస్తున్నట్టు ఏపీ గుర్తించింది. ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలున్న తల్లిదండ్రులను వారి కుటుంబాలకు దూరంగా ఉంచడం.. భారీగా జరిమానా విధించడం చేస్తున్నారు. అలాగే, పిల్లల్ని దాచిపెట్టారేమోనన్న అనుమానంతో ఇళ్లపై పోలీసులు దాడిచేసి, తల్లిదండ్రులను భయపెడుతుంటారు.
ముగ్గురు పిల్లలున్నారనే కారణంతో కజికిస్థాన్ సంతతి చైనా మహిళ గుల్నార్ ఒమిర్జఖ్కు గర్బోనిరోధక లూప్ వేయించాలని ప్రభుత్వం ఆదేశించింది. రెండేళ్ల తరువాత జనవరి 2018లో మిలటరీ అధికారులమంటూ నలుగురు ఇంటికొచ్చి భర్తను అదుపులోకి తీసుకున్నారు. కూరగాయల వ్యాపారం చేసుకుని జీవనం సాగించే వారికి ఇద్దరు కంటే ఎక్కువ మంది సంతానం ఉన్నారని, 2,685 డాలర్ల జరిమానా మూడు రోజుల్లో చెల్లించాలని ఆదేశించారు. అలా చెల్లించకపోతే భర్తను ఇతర జాతి మైనారిటీల నిర్బంధ శిబిరంలో బంధిస్తామని హెచ్చరించారు.
మైనార్టీల జననాల రేటు నియంత్రణకు చేపట్టిన చర్యలు భయాందోళనలకు గురిచేస్తున్నాయని పలువురు బాధితుల మాటల్లో వెల్లడయ్యింది. ఉయ్ఘుర్ ముస్లింలు ఉండే హోటన్, కస్గర్ ప్రాంతంలో 2015 నుంచి 2018 మధ్య జననాల రేటు 60 శాతం మేర తగ్గిపోయింది. జిన్జియాంగ్ ప్రాంతంలోనూ జననాల రేటు క్షీణించింది. జాతీయ స్థాయి సగటు 4.2 శాతంతో పోలిస్తే ఇక్కడ 24 శాతం మేర తగ్గిపోయినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
జననాల రేటు అత్యంత వేగంగా ఉండే జిన్జియాంగ్ ప్రావిన్సుల్లో మైనార్టీ జనాభా వృద్ధిచెందకుండా వందల నుంచి మిలియన్ల డాలర్లను చైనా ప్రభుత్వం కుమ్మరిస్తోంది.. దీంతో కొన్నేళ్లుగా అక్కడ జననాల రేటు మందగించిందని అసోసియేట్ ప్రెస్ పరిశోధనలో నిగ్గుతేలింది. ఈ రకమైన తగ్గుదల ఆశ్చర్యకరమని.. దీని వెనుక క్రూరత్వం ఉందని చైనాలో మైనారిటీ హక్కుల ఉద్యమకారుడు జెంజ్ అన్నారు. ఇది ఉయ్ఘర్లను లొంగదీసుకునే విస్తృత నియంత్రణ ప్రచారంలో భాగమని వ్యాఖ్యానించారు.