యాప్నగరం

డోక్లాం: భారత్ గురించి చైనాలో గుప్పుమన్న పుకారు!

డోక్లాం నుంచి భారత బలగాలు వైదొలగడానికి కారణం ఇదేనంటూ చైనాలో ఓ వార్త హల్‌చల్ చేసింది. భారత్ డిమాండ్‌కు చైనా ఓకే చెప్పిందని..

TNN 30 Aug 2017, 3:37 pm
భారత్, చైనా మధ్య రెండు నెలలకుపైగా కొనసాగిన డోక్లాం వివాదానికి దౌత్య విధానం ద్వారా తెరపడింది. భూటాన్‌కు చెందిన ఈ ప్రాంతం నుంచి తమ బలగాలను వెనక్కి తీసుకునేందుకు ఇరు దేశాలూ అంగీకరించాయి. డోక్లాం నుంచి సైన్యం వెనక్కి రావాలంటే మౌలిక వసతుల కల్పన కోసం 20 బిలియన్ డాలర్ల మేర రుణం ఇవ్వాలని భారత్ చైనాకు షరతు విధించిందట. ‘ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ హిందుస్థాన్’ అనే వార్తాసంస్థ నుంచి ధృవీకరించిందని చైనాలో ప్రచారం జరిగింది. ఇది నిజమే అనుకొని కొందరు చైనీయులు తెగ ఊగిపోయారు. కొందరు మాత్రం ఈ వార్త నిజమే అనడానికి రుజువేంటని ప్రశ్నించారు.
Samayam Telugu china gives 20 billion soft loan to india for withdrawal of its troops
డోక్లాం: భారత్ గురించి చైనాలో గుప్పుమన్న పుకారు!


ఈ వార్త గుప్పుమనడంతో... చైనా సర్కారు ఉలిక్కిపడింది. డోక్లాం నుంచి వెనక్కి మళ్లాలంటే.. 20 బిలియన్ డాలర్లు రుణం ఇవ్వాలని భారత్ చైనాను డిమాండ్ చేయడం రూమర్ అని తేల్చి చెప్పింది. అసలు ఇండియాలో ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ హిందుస్థాన్ అనే మీడియా సంస్థే లేదని జిన్హువా న్యూస్ ఏజెన్సీ స్పష్టత ఇచ్చింది. భారత్‌లో చాలా మంది ఉద్యమకారులు, రాజకీయ నాయకులు.. భారత్ నుంచి చైనా కంపెనీలు వెనక్కి మళ్లాలని డిమాండ్ చేస్తున్నారని చెప్పింది.

వాస్తవానికి చైనానే పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయింది. ఇండియాలో ఫోన్లు, చౌక వస్తువులు అమ్ముకోవడం మినహా మనకు 20 బిలియన్ డాలర్ల మేర ఛీప్‌గా అప్పులు ఇచ్చేంత సీన్ డ్రాగన్‌కు లేదు. పాపం.. సగటు చైనీయుడు ఈ విషయం పట్టించుకోకుండా కంగారు పడిపోయాడంతే..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.