యాప్నగరం

చైనాకు షాక్ ఇచ్చిన ఐక్యరాజ్య సమితి

దక్షిణ సముద్రంలో చైనాకు ఎలాంటి హక్కులేదంటూ యు.ఎన్.ఓ సంచలన తీర్పు వెలువరించింది.

TNN 12 Jul 2016, 5:19 pm
దక్షిణ ప్రాంతంలో ఉన్న సముద్రంపై చైనాకు ఎలాంటి హక్కులేదని ఐక్యరాజ్య సమితి సంచలన తీర్పు వెలువరించింది. చారిత్రకంగా చూసినా చైనాకు ఈ సముద్రంపై హక్కులు ఉన్నట్లు ఆధారాలు లేవని హేగ్ ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. అలాగే సముద్ర భాగంలోని దీవులపై కూడా ఆ దేశానికి ఎలాంటి హక్కు లేదని పేర్కొంది.
Samayam Telugu china has no historic rights in south china sea un backed tribunal
చైనాకు షాక్ ఇచ్చిన ఐక్యరాజ్య సమితి


గత కొన్నేళ్లుగా దక్షిణ సముద్రంలో వేటకు వెళ్లిన చుట్టపక్కల ఉన్న దేశాలకు చెందిన మత్య్సకారులను చైనా నిర్భందిస్తూ వస్తోంది. దీంతో పాటు సముద్ర ప్రాంతంలో ఉన్న దీవులను ఆక్రమిస్తూ సైనిక స్థావరాలను నెలకొల్పుతూ చైనా దూకుడు ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనాపై ఐక్యరాజ్యసమితిలో తైవాన్,మలేషియా.. తదితర దేశాలు 2013లో ఐరాస ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేశాయి. మూడేళ్ల పాటు విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఐక్యరాజ్య సమితి తీర్పు నేపథ్యంలో చైనా ఎలా స్పందిస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.

కాగా భారత భూభాగాన్ని ఆక్రమిస్తూ చైనా ఇదే రకమైన ధోరణి అవలంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి తీర్పు చైనా దూకుడుకు అడ్డుకట్టవేసినట్లయిందని మేధావులు అభిప్రాయపడుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.