యాప్నగరం

వివాదస్పద దీవులపై దూకుడు ప్రదర్శిస్తోన్న చైనా

ద‌క్షిణ చైనా సముద్రం విష‌యంలో చైనా దూకుడుగా వ్యవహరిస్తోంది. అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను ఏమాత్రం ఖాతరు చేయకుండా ముందుకు వెళుతోంది.

TNN 17 May 2017, 5:09 pm
ద‌క్షిణ చైనా సముద్రం విష‌యంలో చైనా దూకుడుగా వ్యవహరిస్తోంది. అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను ఏమాత్రం ఖాతరు చేయకుండా ముందుకు వెళుతోంది. తాజాగా వియ‌త్న‌ాం మిలిట‌రీ కంబాట్‌ డైవ‌ర్స్‌ను ఎదుర్కోడానికి దక్షిణ చైనా దీవుల్లోకి రాకెట్ లాంచ‌ర్ల‌ను పంపినట్లు చైనా అధికార పత్రిక తెలిపింది. ఈ ప్రాంతంపై చైనాకు ఎలాంటి హక్కు లేదని అంతర్జాతీయ న్యాయస్థానం వెల్లడించినప్పటికీ, ఆ దీవులు తమవేనంటూ వాదిస్తోంది. ఈ అంశంపై గతంలో చైనాను అమెరికా హెచ్చ‌రించింది. ఈసముద్రంపై ఎలాంటి హ‌క్కు లేకపోయినప్పటికీ రాకెట్ లాంచ‌ర్ల‌ను అమర్చి అమెరికాను మ‌రింత రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం చేస్తోంది.
Samayam Telugu china installs rocket launchers on disputed south china sea island report
వివాదస్పద దీవులపై దూకుడు ప్రదర్శిస్తోన్న చైనా


స్పార్ట్‌లీ దీవుల్లోని ఫియెరీ క్రాస్‌రీఫ్‌పై శ‌త్రు దేశాల కంబాట్ డైవ‌ర్స్‌ను గుర్తించి, దాడి చేయ‌గ‌ల సీఎస్‌/ఏఆర్‌-1 టైపు రాకెట్ లాంచ‌ర్ల‌ను మోహ‌రించినట్లు చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ మంగళవారం పేర్కొంది. ఫియెరీ క్రాస్‌రీఫ్ దీవులపై చైనా అజమాయిషీ చెలాయిస్తుంటే ఫిలిప్పైన్స్, వియత్నాం, తైవాన్‌లు కూడా ఈ దీవులు మావేనంటూ వాదిస్తున్నాయి. రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఆ పత్రిక తెలపలేదు.

కానీ 2014 మే తర్వాత పార్సెల్ దీవుల్లో వియత్నాం పెద్ద సంఖ్యలో చేపల వలలను అమర్చడం వల్ల ఇక్కడ రక్షణ చర్యలు చేపట్టవలసిన బాధ్యత ఉందని తెలిపింది. అంతే కాదు ఫియెరీ క్రాస్ రీఫ్ దీవిలో చైనా విస్తృతమైన భూపునరుద్దరణ పనులను చేపడుతుంది. వీటిలో ఎయిర్‌పోర్ట్ భవనం కూడా ఉంది. ఏటా దక్షిణ చైనా ద్వారా 5 ట్రిలియన్ డాలర్ల విలువైన వాణిజ్య కార్యకలాపాలు సాగుతాయి. చైనాతోపాటు వియత్నాం, మలేసియా, బ్రూనై, ఫిలిప్పైన్స్, తైవాన్‌కు ఈ ప్రాంతాన్ని తమదిగా పేర్కొంటున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.