యాప్నగరం

China: ఐరాస రహస్య భేటీలో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తనున్న డ్రాగన్.. కానీ!

UNSC క్లోజ్డ్ డోర్ మీటింగ్‌‌లో కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడానికి చైనా ప్రయత్నిస్తోంది. డ్రాగన్ యత్నాలను మిగతా సభ్య దేశాలు తిప్పికొట్టే అవకాశం ఉంది.

Samayam Telugu 15 Jan 2020, 7:12 pm
కశ్మీర్ అంశాన్ని చైనా మరోసారి ఐరాసలో లేవనెత్తనుందని తెలుస్తోంది. బుధవారం న్యూయార్క్‌లో జరిగే భద్రతా మండలి క్లోజ్‌డ్ డోర్ మీటింగ్‌లో కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడానికి చైనా యత్నించనుందని సమాచారం. కాగా ఇతర సభ్య దేశాలు దాన్ని వ్యతిరేకించే అవకాశం ఉంది. గతంలో చైనా ఇలాంటి ప్రయత్నమే చేయగా.. ఫ్రాన్స్ వ్యతిరేకించింది. మరోసారి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురు కావచ్చు. ఓ ఆఫ్రికా దేశానికి సంబంధించిన సమస్యను చర్చించడం కోసం భద్రతా మండలి క్లోజ్డ్‌ డోర్ మీటింగ్‌ (రహస్య భేటీ)ను ఏర్పాటు చేస్తున్నారు. ఏవైనా ఇతర అంశాల కింద కశ్మీర్ విషయాన్ని ప్రస్తావించడానికి చైనా రిక్వెస్ట్ పెట్టుకుంది.
Samayam Telugu Jammu-Kashmir-Ladakh


కశ్మీర్ సమస్యను భారత్, పాకిస్థాన్ పరిష్కరించుకోవాలన్న ఫ్రాన్స్ వైఖరిలో మార్పు లేదని తెలుస్తోంది. గతంలో పలుసార్లు ఇదే మాట చెప్పిన ఫ్రాన్స్.. ఐరాస భద్రతా మండలిలో పునరుద్ఘాటించనుందని సమాచారం.

గత నెలలోనూ భద్రతా మండలి క్లోజ్డ్ డోర్ మీటింగ్‌లో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తడానికి చైనా ప్రయత్నించింది. కానీ మిగతా సభ్య దేశాలైన ఫ్రాన్స్, అమెరికా, బ్రిటన్, రష్యా దానికి అడ్డుపడ్డాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.