యాప్నగరం

‘భారత్‌తో యుద్ధానికి కౌంట్‌డౌన్ మొదలు’

భారత్‌తో యుద్ధానికి కౌంట్ డౌన్ మొదలైంది. కశ్మీర్, కాలపానీల్లో చైనా సైన్యం అడుగుపెడితే మీరేం చేస్తారు?

TNN 9 Aug 2017, 6:58 pm
భారత్‌తో యుద్ధానికి కౌంట్‌డౌన్ మొదలైందంటూ చైనాకు చెందిన ఓ దినపత్రిక అవాక్కులు చెవాక్కులు పేలింది. డోక్లాం నుంచి భారత బలగాలు వెనక్కి మళ్లకపోవడంతో.. కశ్మీర్‌లో లేదా భారత్, నేపాల్ మధ్య వివాదాస్పదమైన కాలాపానీలోకి మా సైన్యం అడుగుపెడితే ఏం చేస్తారంటూ చైనా ప్రభుత్వానికి చెందిన సీనియర్ అధికారి వాంగ్ వెన్లీ మంగళవారం వ్యాఖ్యానించారు. ఈ విషయమై రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ స్పందిస్తూ.. దేశ భద్రతకు ముప్పు వాటిల్లే పరిస్థితి తలెత్తితే.. యుద్ధానికి తమ సైనికులు సిద్ధంగా ఉన్నారంటూ దీటుగా బదులిచ్చారు.
Samayam Telugu china media and senior official both issue strong warnings on war with india
‘భారత్‌తో యుద్ధానికి కౌంట్‌డౌన్ మొదలు’


డోక్లాంలో ఒక్క భారత సైనికుడు, ఒక్క రోజు ఉన్నా.. అది మా సార్వభౌమత్వానికి సవాల్ విసిరినట్లే, మా భద్రతకు ముప్పే అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన వాంగ్ వెన్లీ అనే ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. సమయం గడిచిపోతోంది.. ఏదైనా జరిగితే దానికి భారత్‌దే బాధ్యత. డోక్లాం ప్రాంతం నుంచి భారత బలగాలు వెనక్కి మళ్లకపోతే.. సమస్యను శాంతియుతంగా పరిష్కరించడానికి మార్గాలు మూసుకు పోతున్నాయని చైనా డైలీ రాసుకొచ్చింది.

భూటాన్‌లో భాగమైన డోక్లాం ప్రాంతంలో చైనా రోడ్డు నిర్మాణం చేపట్టగా.. భారత సైన్యం దాన్ని నిలువరించింది. రక్షణ పరంగా సున్నితమైన ఈ ప్రాంతంలో రోడ్డు నిర్మాణం చేపట్టడానికి వీల్లేదని తెగేసి చెబుతోంది. ఇరు దేశాల సైన్యాన్ని అక్కడి నుంచి ఉపసంహరిద్దామని భారత్ ప్రతిపాదించగా.. దానికి చైనా అంగీకరించలేదు. భారత సైన్యం అక్రమంగా తమ దేశంలో అడుగు పెట్టిందంటూ కయ్యానికి కాలు దువ్వుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.