యాప్నగరం

స్కూల్‌లో పేలుడు... 7 గురు చిన్నారులు మృతి

వాళ్లంతా మూడు, నాలుగేళ్ల లోపు చిన్నారులు. అప్పటి వరకు ఆడుతూ పాడుతూ సరదాగా గడిపిన ఆ చిన్నారులు బాంబు భూతానికి విగతజీవులుగా మారారు.

TNN 15 Jun 2017, 6:54 pm
నర్సరీ స్కూల్‌లో భారీ పేలుడు సంభవించి అభం శుభం ఎరుగుని ఏడుగురు చిన్నారులను బలితీసుకుంది. ఈ ఘటన చైనాలోని జియాంగ్స్ ప్రావిన్సులో చోటుచేసుకుంది. జియాంగ్స్ ప్రావిన్సులు ఫెంగ్జియాన్ కౌంటీలోని ఓ కిండర్ గార్డెన్ స్కూల్‌లో ఈ రోజు సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో బాంబు పేలుడు సంభవించింది. పాఠశాల ముగిసిన తర్వాత పిల్లలు బయటకు వస్తుండగా, గేట్ సమీపంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో అక్కడక్కడే ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. పేలుడు శబ్దానికి చిన్నారులు, విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకలు గురయ్యారు. చైనా అధికారి న్యూస్ జిన్హూ కూడా దీన్ని ధ్రువీకరించింది.
Samayam Telugu china nursery blast seven dead in jiangsu explosion
స్కూల్‌లో పేలుడు... 7 గురు చిన్నారులు మృతి


ఈ ఘటనలో ఏడుగురు చిన్నారులు మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. పాఠశాల ముగిసే సమయం కావడంతో తమ పిల్లలను తీసుకువెళ్లేందుకు తల్లిదండ్రులు అక్కడికి చేరుకునే సందర్భంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ సంఘటనకు ఎవరు బాధ్యులనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. దీనిపై విచారణ ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఐదు గంటల ప్రాంతంలో పేలుడు సంభవించి, భారీ శబ్దం వచ్చిందని పాఠశాల సమీపంలోని ఓ దుకాణదారుడు తెలిపినట్లు చైనీస్ న్యూస్ వెబ్‌సైట్ సోహూ పేర్కొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.