చైనా అధ్యక్షుడు జిన్పింగ్పై ఎన్నో ఊహాగానాలు మొదలయ్యాయి. జిన్పింగ్ తన పదవి నుంచి వైదొలగవచ్చని చైనా సోషల్ మీడియాలో రూమర్లు హల్చల్ చేస్తున్నాయి. చైనాను పాలించే అధికార పార్టీ పొలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటీ సమావేశం తర్వాత జింగ్పింగ్ పదవీ విరమణ గురించి పుకార్లు బయటకు వచ్చాయి. కోవిడ్ వైరస్ కట్టడిలో జిన్పింగ్ విఫలమయ్యారని, దాంతో ఆయన తన పదవి నుంచి తప్పుకుంటున్నట్టుగా వార్తలు గుప్పుమన్నాయి. ఈ క్రమంలో కెనడా దేశానికి చెందిన ఓ బ్లాగర్ చేసిన వీడియో చైనాలో ట్రెండ్ అవుతుంది. ఆ బ్లాగర్ జిన్పింగ్ను పక్కనపెట్టనున్నట్టు వీడియోలో చెప్పారు. జిన్పింగ్ తప్పుకోవడమే కాదు.. అతని స్థానంలో ప్రస్తుతం ప్రధానిగా లీ కీక్వాంగ్ బాధ్యతలు చేపడతారని కూడా తెలిపారు. ఇక పార్టీని ప్రభుత్వాన్ని కూడా ఆయనే నడిపిస్తారని కూడా పేర్కొన్నారు.
కాగా చైనాలో కోవిడ్ కేసులు విపరీతంగా పెరిగాయి. ఆ క్రమంలో కోవిడ్ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు జిన్పింగ్ కఠినమైన జీరో కోవిడ్ విధానాన్ని అవలభించారు. అయితే విస్తృతమైన లాక్డౌన్లతో దేశవ్యాప్తంగా వ్యాపారాలు దెబ్బతిన్నాయి. దాంతో ఆర్థిక వృద్ధి కుంటుపడింది. ఈ క్రమంలో కోవిడ్ మహమ్మారి ఆర్థిక, సామాజిక వృద్థికి ఆటంకంగా మారిందని ఓ చైనా అధికారి అన్నారు. కోవిడ్ అరికట్టేందుకు ఒకే రకమైన ప్రణాళికను అనుసరించకూడదని అభిప్రాయపడ్డారు.
అదేవిధంగా కఠిన నిబంధనల కారణంగా పరిశ్రమల ఉత్పత్తి తగ్గిందని, తయారీ రంగ పరిశ్రమలు క్షీణిస్తున్నాయని, ఇప్పటికే కంపెనీలు డీలా పడినట్టు నిపుణులు సైతం పేర్కొన్నారు. అంతేకాకుండా ఏప్రిల్లో చైనా కరెన్సీ విలువ నాలుగు శాతం తగ్గినట్టు తెలుస్తుంది. గడిచిన 28 ఏళ్లలో ఇంతగా పడిపోవడం ఇదే మొదటిసారి. అయితే ఇప్పటికే షాంఘైలో కోవిడ్ ఆంక్షల కారణంగా అక్కడి ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అధికారులను, పాలకులపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో జిన్పింగ్పై ఇలాంటి వార్తలు రావడం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
కాగా చైనాలో కోవిడ్ కేసులు విపరీతంగా పెరిగాయి. ఆ క్రమంలో కోవిడ్ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు జిన్పింగ్ కఠినమైన జీరో కోవిడ్ విధానాన్ని అవలభించారు. అయితే విస్తృతమైన లాక్డౌన్లతో దేశవ్యాప్తంగా వ్యాపారాలు దెబ్బతిన్నాయి. దాంతో ఆర్థిక వృద్ధి కుంటుపడింది. ఈ క్రమంలో కోవిడ్ మహమ్మారి ఆర్థిక, సామాజిక వృద్థికి ఆటంకంగా మారిందని ఓ చైనా అధికారి అన్నారు. కోవిడ్ అరికట్టేందుకు ఒకే రకమైన ప్రణాళికను అనుసరించకూడదని అభిప్రాయపడ్డారు.
అదేవిధంగా కఠిన నిబంధనల కారణంగా పరిశ్రమల ఉత్పత్తి తగ్గిందని, తయారీ రంగ పరిశ్రమలు క్షీణిస్తున్నాయని, ఇప్పటికే కంపెనీలు డీలా పడినట్టు నిపుణులు సైతం పేర్కొన్నారు. అంతేకాకుండా ఏప్రిల్లో చైనా కరెన్సీ విలువ నాలుగు శాతం తగ్గినట్టు తెలుస్తుంది. గడిచిన 28 ఏళ్లలో ఇంతగా పడిపోవడం ఇదే మొదటిసారి. అయితే ఇప్పటికే షాంఘైలో కోవిడ్ ఆంక్షల కారణంగా అక్కడి ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అధికారులను, పాలకులపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో జిన్పింగ్పై ఇలాంటి వార్తలు రావడం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.