యాప్నగరం

నిప్పుతో చెలగాటం ఆడొద్దు.. అమెరికాకు చైనా వార్నింగ్

China Vs US: అమెమరికా, చైనా మధ్య వివాదం ముదురుతోంది. నిప్పుతో చెలగాటం ఆడొద్దని చైనా అమెరికాను హెచ్చరించింది. తైవాన్ పర్యటనపై అభ్యంతరం వ్యక్తం చేసింది.

Samayam Telugu 13 Aug 2020, 12:47 am
మెరికా, చైనా మధ్య మాటలయుద్ధం మరింత ముదిరింది. ‘నిప్పుతో చెలగాటం ఆడొద్దు’ అని అమెరికాను చైనా హెచ్చరించింది. అమెరికా ప్రతినిధులు ఇటీవల తైవాన్‌ను సందర్శించడంపై డ్రాగన్ ఈ వ్యాఖ్యలు చేసింది. అమెరికా ఆరోగ్య విభాగ చీఫ్‌ అలెక్స్‌ అజర్‌ ఇటీవల తైవాన్‌లో 3 రోజుల పాటు పర్యటించారు. తన పర్యటనలో భాగంగా కరోనా వైరస్‌ విషయంలో చైనా తీరుపై ఆయన విమర్శలు చేశారు.
Samayam Telugu చైనా వర్సెస్ అమెరికా
China comments on America


అజర్‌ పర్యటనపై చైనా ప్రతినిధి బుధవారం (ఆగస్టు 12) స్పందించారు. తైవాన్‌, అమెరికా మధ్య అధికారుల రాకపోకలను చైనా వ్యతిరేకిస్తున్నట్లు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఝావో లిజియాన్‌ పేర్కొన్నారు.

‘పూర్తిగా చైనాకు సంబంధించిన వ్యవహారాల్లో అమెరికా అనవసరంగా తలదూరుస్తోంది. లేని భ్రాంతులను సృష్టిస్తోంది. నిప్పుతో చెలగాటం ఆడితే కాలుతుంది’ అని లిజాయన్ పేర్కొన్నారు. ‘ఎవరికో బానిసలుగా ఉండొద్దు.. విదేశీయుల మద్దతుపై ఆధారపడి స్వతంత్రం కోసం ఆరాటపడితే అది ముగింపే అవుతుంది’ అని ఆయన పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.