యాప్నగరం

భారత్‌కు చైనా కుబేరుడు జాక్ మా భారీ సాయం

China Jack Ma: చైనా అపర కుబేరుడు జాక్ మా భారత్‌కు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. మొత్తం ఏడు దేశాలకు మెడికల్ కిట్లను పంపిణీ చేస్తున్నారు.

Samayam Telugu 29 Mar 2020, 10:55 pm
ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్‌ (కోవిడ్ 19) మహమ్మారిపై పోరాటంలో భాగంగా భారత్‌కు సాయం చేసేందుకు చైనాకు చెందిన అపర కుబేరుడు జాక్‌ మా ముందుకొచ్చారు. వ్యక్తిగత రక్షణ కవచాలు, కరోనా పరీక్షలకు కిట్లను భారత్‌తో సహా ఏడు దేశాలకు అందజేస్తున్నట్లు జాక్ మా, ఆలీబాబా ఫౌండేషన్లు తెలిపాయి.
Samayam Telugu jack ma


మొత్తంగా 17 లక్షల ఫేస్‌ మాస్క్‌లు, 1.65 లక్షల టెస్ట్‌ కిట్స్‌, రక్షణకు అవసరమైన దుస్తులు, వెంటిలేటర్లు, ఇన్‌ఫారెడ్‌ థర్మామీటర్లను.. భారత్‌, భూటాన్‌, అజర్‌బైజాన్‌, ఖజకిస్థాన్‌, కిర్గిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌, వియత్నాం దేశాలకు సాయం చేస్తున్నట్లు వెల్లడించాయి. కోవిడ్‌-19పై చేస్తున్న యుద్ధంలో తాము భాగస్వాములమని, వైద్య సామాగ్రి అవసరమైన చోట సాధ్యమైనంత వేగంగా అందించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపాయి.

జాక్‌ మా‌, అలీబాబా ఫౌండేషన్‌లు భారత్‌కు పంపించిన వైద్య సామాగ్రి శనివారం రాత్రి ఢిల్లీకి చేరుకుంది. దేశంలో వీటిని పంపిణీ చేయడానికి భారత రెడ్‌ క్రాస్‌ సొసైటీ సహాయపడుతుంది. మిగిలిన సామాగ్రి మరికొన్ని రోజుల్లో భారత్‌కు చేరుకుంటుంది. అయితే ఈ రెండు ఫౌండేషన్‌లు ఇప్పటివరకు 23 ఆసియా దేశాలకు 74 లక్షల మాస్క్‌లు, 4.85 లక్షల టెస్టు కిట్స్‌, లక్ష వైద్య సంరక్షణ దుస్తులు సాయం చేశాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.