యాప్నగరం

చైనా పొరుగు దేశంలో మరో కొత్త వైరస్.. కరోనా కంటే ప్రమాదకారి

ప్రపంచదేశాలు కరోనా వైరస్‌తో వేగలేక సతమతమవుతుంటే చైనా పొరుగుదేశంలో మరో కొత్త తరహా వైరస్ వెలుగుచూడటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇది కరోనా కంటే ప్రమాదకారని అంటున్నారు.

Samayam Telugu 10 Jul 2020, 12:54 pm
తమ పొరుగున ఉన్న కజకిస్థాన్‌లో కరోనా కంటే ప్రమాదకరమైన కొత్తరకం వైరస్ వ్యాప్తి చెందుతున్నట్టు అక్కడ చైనా చేసిన ప్రకటనతో ఆందోళన వ్యక్తమవుతోంది. అంతుచిక్కని ఈ వైరస్‌ కారణంగా వ్యాధులు ప్రబలి, వందలాది మంది మృత్యువాత పడుతున్నారని, దీనిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కజకిస్థాన్‌లోని చైనా రాయబార కార్యాలయం సూచనలు చేసింది. దీని గురించి చైనా మీడియాలోనూ కథనాలు వెలువడ్డాయి. ఈ కొత్త తరహా వైరస్ వల్ల మరణాల సంఖ్య కరోనాను మించి ఉంటుందని.. దీనిపై వైద్య నిపుణులు పరిశోధనలు నిర్వహించినా ఇది ఏంటనేది గుర్తించలేకపోయారని తెలిపింది.
Samayam Telugu కజకిస్థాన్‌లో కొత్త రకం వైరస్
Kazakhstan Virus


ఓ వైరస్‌ సోకుతుండడంతో న్యుమోనియాతో జూన్‌లో ఏకంగా 628 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ కంటే ఇది అత్యంత ప్రమాదకరమైనదని హెచ్చరించింది. ఆరు నెలల్లోనే దీని వల్ల 1,772 మంది మృతి చెందారని.. ఒక్క జూన్‌‌లోనే 628 మంది చనిపోయారని వివరించింది.

కజకిస్థాన్‌లోని చైనా పౌరులు కూడా చాలామంది ఈ వైరస్‌ బారినపడి మృతి చెందారు. ఆ కొత్త వైరస్‌ గురించి విశ్లేషించేందుకు వైద్య నిపుణులు ప్రయత్నాలు జరుపుతున్నారు. ఇప్పటికీ దాన్ని గురించిన పూర్తి వివరాలు కనిపెట్టలేకపోయారు. కజకిస్థాన్‌లో కరోనా బారినపడ్డ వారి కంటే గుర్తుతెలియని మరో కొత్త వైరస్‌ వల్ల మృతి చెందిన వారి సంఖ్య అధికంగా ఉందని చైనా మీడియా ప్రకటించింది.

చైనా రాయబార కార్యాలయం గుర్తుతెలియని న్యూమోనియాగా పేర్కొంటూ.. కజకిస్థాన్ అధికారులు, మీడియా మాత్రం ఇది న్యూమోనియా అని ప్రకటించారు. ఇది గుర్తుతెలియని వైరస్ అంటూ ఎందుకు ప్రకటించామో చైనా రాయబార కార్యాలయం వివరణ ఇవ్వలేదు. ఎంబసీ వెబ్‌సైట్‌లో మాత్రం అతౌరా, అక్తోబే ప్రావిన్సులు, షిమ్కెంట్ నగరంలో న్యూమోనియా కేసులు జూన్ నెల మధ్య నుంచి పెద్ద సంఖ్యలో పెరుగుతున్నాయని స్థానిక మీడియాలో కథనాలు వచ్చినట్టు పేర్కొంది.

షిమ్కెంట్, అతౌరా రాజధాని నగరం మధ్య 1,500 కిలోమీటర్లు దూరం ఉండగా.. అక్తోబ్, అతౌరా మధ్య 330 కిలోమీటర్లు దూరం ఉంది. మూడు చోట్ల ఇప్పటివరకు దాదాపు 500 న్యుమోనియా కేసులు నమోదయ్యాయని, 30 మందికి పైగా పరిస్థితి విషమంగా ఉందని చైనా రాయబార కార్యాలయం తెలిపింది.

కజికిస్థాన్ రాజధాని నౌర్-సూల్తానా నగరం ఆరోగ్య విభాగం చీఫ్ సౌలే కైసికోవా మాట్లాడుతూ.. న్యూమోనియా లక్షణాలతో రోజుకు 300 మంది ఆస్పత్రుల్లో చేరుతున్నారన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.