యాప్నగరం

భారత అమ్ములపొదిలో అమెరికా ఆయుధ డ్రోన్లు!

భారత్ తమకు నమ్మకమైన భాగస్వామి అని ఇటీవలే ప్రకటించిన అమెరికా.. మరో గుడ్ న్యూస్ చెప్పింది.

TNN 22 Oct 2017, 2:15 pm
రక్షణ పరంగా భారత్ అత్యంత నమ్మకమైన భాగస్వామి అని ఇటీవలే ప్రకటించిన అమెరికా.. మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఆయుధాలను మోసకెళ్లగలిగే డ్రోన్లను భారత్‌కు విక్రయించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపింది. ఈ డ్రోన్ల చేరికతో భారత వైమానిక దళం మరింత బలోపేతం అవుతుంది. శత్రు భూభాగంలోకి చొచ్చుకెళ్లి.. తేలిగ్గా దాడులు జరపడానికి వీలవుంది. తమకు డ్రోన్లు కావాలని ఈ ఏడాది ఆరంభంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అమెరికాను కోరింది. 8 బిలియన్ డాలర్ల వ్యయంతో 80-100 డ్రోన్ల కొనుగోలుకు ఆసక్తి కనబర్చింది.
Samayam Telugu considering indian request of armed drones for indian air force us official
భారత అమ్ములపొదిలో అమెరికా ఆయుధ డ్రోన్లు!


ఈ ఏడాది జూన్ 26 డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని మోదీ భేటీ అయ్యాక.. 22 డ్రోన్లను విక్రయించడానికి అమెరికా ఓకే చెప్పింది. ఆయుధ సామర్థ్యం లేని ఈ డ్రోన్లను హిందు మహాసముద్రంలో నిఘా కోసం ఉపయోగిస్తున్నారు. ఆయుధాలను విక్రయించడమే కాదు, భారత్‌తో రక్షణ సహకారాన్ని పెంపొందించుకోవాలని భావిస్తున్నామని పేరు వెల్లడించడానికి ఇష్టపడని అమెరికా అధికారి ఒకరు తెలిపారు. చాలా కాలంగా సముద్ర దొంగల ఆట కట్టించడంలో భారత నౌకాదళం, అమెరికా నేవీ కలిసి పోరాడుతున్నాయని ఆయన గుర్తు చేశారు.


ఒబామా సర్కారు భారత్‌ను ప్రధాన రక్షణ భాగస్వామిగా గుర్తించగా.. ప్రస్తుత ట్రంప్ ప్రభుత్వం భారత్‌తో సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులేస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.