యాప్నగరం

అమెరికాలో కరోనాతో పసికందు మృతి.. షాకింగ్ విషయం చెప్పిన డాక్టర్లు

కరోనాతో అమెరికాలో పసికందు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై ఇల్లినాయిస్ గవర్నర్ షాకింగ్ విషయం చెప్పారు. కరోనాతో పసికందు ప్రాణాలు కోల్పోవడం ప్రపంచంలో ఇదే తొలిసారని తెలిపారు.

Samayam Telugu 29 Mar 2020, 3:39 pm
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి రోజులు గడిచే కొద్దీ దావానంలా వ్యాపిస్తూ ప్రజల ప్రాణాలను హరిస్తోంది. ఈ వైరస్ సోకిన వాళ్లలో పెద్ద వయస్కులకే ప్రాణహాని ఉంటుందని, యుక్త వయస్కులు, చిన్న పిల్లలపై ఈ వైరస్ ఎక్కువ ప్రభావం చూపదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే కొన్నిచోట్ల టీనేజర్లు కూడా దీని ప్రభావంతో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు నమోదయ్యాయి. అయితే ప్రపంచంలోనే తొలిసారి కరోనా వైరస్ కారణంగా నెలల వయసున్న పసిపాప మృతిచెందడం కలవరం కలిగిస్తోంది. అమెరికాలోని ఇలినాయిస్లో కరోనా ప్రభావంతో చనిపోయిన వారిలో ఏడాది లోపు వయసున్న పాప ఉన్నట్టు ఆ రాష్ట్ర గవర్నర్ జేబీ ప్రిజ్కర్ మీడియా సమావేశంలో చెప్పారు.
Samayam Telugu baby_theft_from_hospital_1


Also Read: కోలుకున్న కెనడా ప్రధాని భార్య... కరోనాతో స్పెయిన్ రాకుమారి మృతి

ఆ చిన్నారి కోవిడ్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చిందని అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ ధ్రువీకరించింది. విశ్వమంతా వ్యాపించిన కరోనా మహమ్మారి కారణంగా ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారని డాక్టర్లు చెబుతున్నారు. పాప మరణానికి గల కారణాలపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుగుతోందని, ఈ ఘటన తనను తీవ్రంగా కలిచి వేసిందని గవర్నర్ ప్రిజ్కర్ పేర్కొన్నారు. ‘ప్రాణాంతక వైరస్‌తో అన్ని వయసుల వారు ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా వృద్ధులకు ప్రమాదం ఎక్కువగా ఉంది. ఇల్లినాయిస్‌లో మరణించిన వారిలో 85 శాతం మంది 60 ఏళ్లు పైబడిన వారే ఉన్నారు. కరోనాతో చనిపోయినవారి కుంటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాం’ అని ఆయన తెలిపారు.

Also Read: రోగి కోలుకున్నా వారిలో మరో 8రోజులు వైరస్.. వీరి వల్ల కూడా కోవిడ్ వ్యాప్తి!

పసిపాపలు మొదలుకొని కౌమారప్రాయం వరకు కోవిడ్ వల్ల తీవ్ర అస్వస్థతకు గురికావడం, ప్రాణాపాయం సంభవించడం చాలా అరుదు. ఈ ప్రాణాంతక వైరస్‌ మూలంగా అమెరికాలో ఇంతవరకు వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారే ఎక్కువగా మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో పసిపాప మరణం అందరినీ కలిచివేసింది. చిన్నారి మరణంపై పూర్తిస్థాయి విచారణ జరుపుతామని ఐడీపీహెచ్‌ డైరెక్టర్‌ ఎంగోజి ఎంజీకే వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశంగా అమెరికా నిలిచింది. ప్రస్తుతం అక్కడ లక్షా 20 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 2వేలకు మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇల్లినాయిస్‌లోనే 3,491 కేసులు నమోదు కాగా.. 47 మంది మృత్యువాత పడ్డారు.

Also Read: కరోనా ఎఫెక్ట్: చెట్లపైనే యువకుల క్వారంటైన్.. ఐడియా అదిరిపోయింది

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.