యాప్నగరం

ఒక్క అడుగు దూరంలో కరోనా‌కు టీకా.. అత్యవసర వినియోగం కింద ఎఫ్‌డీఏకి ఫైజర్ దరఖాస్తు

అమెరికా ఫార్మ దిగ్గజాలు ఫైజర్, మోడెర్నా కరోనా వైరస్ మహమ్మారిని అడ్డుకునే టీకాను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు టీకాలూ 95 శాతం ప్రభావం చూపుతున్నట్టు ట్రయల్స్‌లో తేలింది.

Samayam Telugu 21 Nov 2020, 2:04 pm
తాము తయారుచేసిన కరోనా వైరస్ టీకాను అత్యవసర వినియోగం కింద అనుమతి కోరుతూ అమెరికా రెగ్యులేటరీకి ఫైజర్ సంస్థ దరఖాస్తు చేసింది. తొలిసారిగా కోవిడ్-19కు వ్యతిరేకంగా టీకా పంపిణీకి రెగ్యులేటరీ అనుమతి కోరడం కీలక ముందడుగు. జర్మనీ సంస్థ బయోఎన్‌టెక్‌తో కలిసి తాము అభివృద్ధి చేసిన టీకా 95 శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు క్లినికల్ ట్రయల్స్ ఫలితాల్లో వెల్లడయ్యిందని ఫైజర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన వెలువడిన వారం రోజుల్లోనే అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేయడం విశేషం.
Samayam Telugu ఫైజర్ వ్యాక్సిన్
Pfizer Vaccine


Read Also: ఇయర్ ఫోన్‌తో రైల్వే ట్రాక్‌పై యువకులు.. ఇంతలోనే ఘోరం.. 50 ముక్కలైన శరీరాలు

అత్యవసర వినియోగం కింద దరఖాస్తు చేసిన విషయాన్ని ఫైజర్ సీఈఓ అల్బర్ట్ బౌర్లా ధ్రువీకరించారు. దీని గురించి ఆ సంస్థ వెబ్‌సైట్‌లో శుక్రవారం మధ్యాహ్నం వీడియోను పోస్ట్ చేశారు. ఎఫ్‌డీఏకు దరఖాస్తు చేసిన విషయం వెల్లడయిన తర్వాత శుక్రవారం మధ్యాహ్నం ఫైజర్, బయోఎన్‌టెక్ షేర్లు లాభాల్లో దూసుకెళ్లాయి. ఫైజర్ 1.3 శాతం, బయోఎన్‌టెక్ 9.3 శాతం మేర లాభపడ్డాయి.

Read Also: వైట్‌హౌస్‌లో మరో భారత సంతతి మహిళకు అత్యున్నత పదవి

అత్యవసర వినియోగానికి ఫైజర్ చేసిన దరఖాస్తులో క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్న 12-15ఏళ్లలోపు చిన్నారుల 100 మంది డేటా కూడా ఉంది. క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్నవారిలో 45 శాతం మంది 56-85ఏళ్ల వయసువారేనని తెలిపింది. ఫైజర్ దరఖాస్తుపై అమెరికా ఆరోగ్య సేవల మంత్రి అలెక్స్ అజర్ స్పందిస్తూ.. ఒకవేళ టీకా 95 శాతం ప్రభావవంతం చూపుతుందని పేర్కొన్న డేటా సరైందే అయితే కొద్ది వారాల్లోనే అనుమతి ఇస్తామని అన్నారు.

Read Also: గుజరాత్: దైవ దర్శనానికి వెళ్లొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు సజీవదహనం
ఇదిలా ఉండగా.. డిసెంబరు మధ్య నాటికి ఎఫ్‌డీఏ నుంచి అనుమతి లభిస్తుందని, ఆ వెంటనే డోస్‌ల సరఫరా చేపట్టాలని ఫైజర్ భావిస్తోంది. ఈ ఏడాది చివరికి 50 మిలియన్ డోస్‌లను సిద్దం చేయనున్నామని తెలిపింది. ఎఫ్‌డీఏ సలహాదారుల కమిటీ డిసెంబరు 8-10 మధ్య సమావేశమై వ్యాక్సిన్ గురించి చర్చించనున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

Read Also: పాక్‌లో బయల్పడ్డ 1300 ఏళ్లనాటి పురాతన విష్ణు దేవాలయం
తుది దశ ఫలితాల సమాచారం ప్రకారం ఫైజర్ టీకా అన్ని వయసులవారిపై ప్రభావం చూపుతోంది. టీకా క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్న 43,000 మందిలో 170 మంది కరోనా వైరస్ సోకగా..162 మందికి ప్లాసిబో ఇచ్చారు. అంటే ఇది 95 శాతం ప్రభావం చూపిందని భావిస్తున్నారు. టీకా మూడో దశ ప్రయోగాల్లో 42 శాతం మంది వివిధ దేశాలకు చెందిన వాలంటరీర్లు, 30 శాతం మంది అమెరికాలో స్థానికులు పాల్గొన్నారని ఫైజర్ తెలిపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.