యాప్నగరం

ఇప్పుడు తగ్గినా మళ్లీ నవంబరులో కరోనా విజృంభణ.. చైనా నిపుణుడు హెచ్చరిక

కరోనా వైరస్ విషయంలో ముందు నుంచి చైనా ధోరణిపై అంతర్జాతీయ సమాజం అనేక అనుమానాలు వ్యక్తం చేస్తోంది. గతేడాది డిసెంబరు తొలివారంలోనే వైరస్ వెలుగుచూసినా జనవరి వరకూ దాని గురించి బయట ప్రపంచానికి తెలియనీయకుండా జాగ్రత్త పడింది.

Samayam Telugu 17 Apr 2020, 4:44 pm
కరోనా వైరస్ మహమ్మారి నుంచి చైనా సహా ప్రపంచ దేశాలు ఇప్పుడు బయటపడ్డా నవంబర్‌లో తిరిగి మరోసారి ప్రబలే అవకాశం ఉందని చైనాకు చెందిన వైద్య నిపుణుడు జాంగ్ వెన్‌హాంగ్ వ్యాఖ్యానించారు. షాంఘైలోని ‘కొవిడ్‌-19 క్లినికల్‌ ఎక్స్‌పర్ట్‌ టీం’ కు నేతృత్వం వహిస్తున్న వెన్‌హాంగ్‌ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో కరోనా మళ్లీ మళ్లీ దాడి చేసే ప్రమాదం ఉన్నందున, ప్రభుత్వాలు అందుకు తగ్గట్టు విధానాలను రూపొందించుకోవాలని ఆయన సూచించారు. ప్రపంచ దేశాలు శరదృతువు నాటికి ఈ మహమ్మారిని నియంత్రణలోకి తీసుకురాగలవని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, శీతాకాలంలో రెండోసారి విజృంభించే ప్రమాదం ఉందన్నారు.
Samayam Telugu zheng


Read Also: బ్రిట‌న్ రాచ కుటుంబాన్ని తాకిన కరోనా సెగ.. ఆ వేడుక రద్దు

వ్యాధి నియంత్రణలో చైనా అనుభవం ఈ ఏడాది తర్వాత కూడా మళ్లీ వినియోగపడుతుంది.. వైరస్ ప్రారంభ దశలో అరికట్టడానికి తీసుకున్న చర్యలను పునరావృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించే ప్రయత్నాల్లో భాగంగా ఆంక్షలను సడలించడంతో జాంగ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. చైనా ఎలాంటి లాక్‌డౌన్‌లు విధించదని, విదేశాల నుంచి వచ్చిన కేసుల వల్ల మరోసారి వ్యాధి ఖచ్చితంగా వ్యాప్తి చెందుతుందని చైనాకు చెందిన ఓ పత్రిక పేర్కొంది.

Read Also: ప్రపంచం కరోనాతో పోరాడుతుంటే ఉగ్రవాదం ఎగుమతిలో పాక్ బిజీగా ఉంది: ఆర్మీ చీఫ్

అంటువ్యాధి నివారణకు నియంత్రణ, సడలింపులు దీర్ఘకాలం కొనసాగుతాయి... దీని వల్ల సాధారణంగా జీవించడం, పనిచేయడం సాధ్యమవుతుంది, కానీ వ్యాప్తి పూర్తిగా నిర్మూలించడం సాధ్యం కాదని వెన్‌హాంగ్ అన్నారు. కరోనాను అన్ని దేశాలు సమర్ధంగా నియంత్రించినప్పుడే మనమందరం ప్రశాంతంగా జీవించగలుగుతామని అన్నారు. పరీక్షలను వేగంగా నిర్వహించడం.. కేసులను గుర్తించడం.. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన బాధితులకు తక్షణమే హాస్పిటల్‌లో చేర్పించి చికిత్స అందజేయడమే అంటువ్యాధిని సమర్దంగా కట్టిడిచేయడానికి ఇదే రహస్యమని జాంగ్ స్పష్టం చేశారు.

Read Also: భారత్ లాంటి దేశాల్లో కరోనా కట్టడిలో కమ్యూనిటీ పాత్ర కీలకం .. డబ్ల్యూహెచ్ఓ.

అమెరికాలో మే చివరినాటికి వైరస్ అదుపులోకి వస్తుందని, ఇరు దేశాలు ఒకరికొకరు సహకరించుకుని దీనిపై పోరాటం చేయాలని సూచించారు. వైద్యస్థాయిలో అమెరికా, చైనాల మధ్య సంబంధాలు నిరంతం కొనసాగుతున్నాయని తెలిపారు. ఔషధాలు, ప్రజల ఆరోగ్యం, అంటువ్యాధి నియంత్రణ విషయానికి వస్తే ఒకొరికరం సహకరించుకుంటున్నామని తెలిపారు.

Read Also: దేశంలో 13,500కి చేరిన కోవిడ్ బాధితులు

కరోనా వైరస్ విషయంలో ముందు నుంచి చైనా ధోరణిపై అంతర్జాతీయ సమాజం అనేక అనుమానాలు వ్యక్తం చేస్తోంది. చైనా శుక్రవారం వెల్లడించిన గణాంకాలు విస్మయానికి గురిచేస్తున్నాయి. తమ దేశంలో కరోనా వైరస్‌తో మొత్తం 4,632 మంది చనిపోయినట్టు ప్రకటించింది. వుహాన్ నగరంలో మరో 1,290 మంది కరోనా వైరస్‌తో చనిపోయినట్టు తెలిపింది. ఏప్రిల్ 16 నాటి సవరించిన అంచనాల ప్రకారం.. వుహాన్‌లో కరోనా వైరస్ కేసులు 325 నుంచి 50,333కి చేరగా.. మరణాలు 1,290 నుంచి 3,869కి చేరాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.