యాప్నగరం

కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వుహాన్ హాస్పిటల్ డైరెక్టర్.. 1868కి చేరిన మరణాలు

కరోనా వైరస్ బారిన పడి వుహాన్ హాస్పిటల్ డైరెక్టర్ ప్రాణాలు వదిలారు. కోవిడ్ కారణంగా మంగళవారం ఒక్కరోజే చైనాలో 98 మంది చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య 1868కి చేరింది.

Samayam Telugu 18 Feb 2020, 11:13 am
కరోనా వైరస్ కారణంగా చైనాలో మరణించిన వారి సంఖ్య ఫిబ్రవరి 17 నాటికి 1,868కి చేరింది. మంగళవారం ఒక్క రోజే 98 మందికిపైగా ప్రాణాలు వదిలారు. 72 వేల మందికిపైగా కోవిడ్ బారినపడ్డారని చైనా ప్రభుత్వం తెలిపింది. కరోనా బారిన పడటంతో.. వుహాన్‌లోని ఓ హాస్పిటల్ డైరెక్టర్ సైతం ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వుచాంగ్ హాస్పిటల్ డైరెక్టర్ లియు ఝిమింగ్ కరోనా వైరస్ కారణంగా మంగళవారం ఉదయం ప్రాణాలు కోల్పోయారని సీసీటీవీ రిపోర్టర్ తెలిపారు. కోవిడ్ కారణంగా చనిపోయిన హాస్పిటల్ తొలి డైరెక్టర్ ఝిమింగే కావడం గమనార్హం.
Samayam Telugu wuhan hospital director


గతంలో కరోనా వైరస్ పరీక్షల కోసం రెండ్రోజుల సమయం తీసుకోగా.. ఇప్పుడు 4-6 గంటల్లోనే కరోనా వైరస్‌ను నిర్ధారిస్తున్నామని చైనా విదేశంగా శాఖ తెలిపింది. కరోనా విజృంభణ కారణంగా అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న వైద్య పరికరాలపై టారిఫ్‌లను మినహాయిస్తున్నట్టు చైనా ప్రకటించింది. మరోవైపు డైమండ్ ప్రిన్సెస్ క్రూయిజ్ షిప్‌లో ఉన్న వారిలో 454 మందికి కరోనా వైరస్ సోకిందని జపాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ షిప్‌ను యోకహోమా తీరంలో నిలిపి ఉంచారు.

కరోనా వైరస్ భయంతో న్యూయార్క్, లండన్ నగరాలు సహా ప్రధాన విమానయాన మార్గాల్లో సింగపూర్ ఎయిర్‌లైన్స్ సేవలను తాత్కాలికంగా మూసివేసింది. డిమాండ్ తక్కువగా ఉండటమే దీనికి కారణమని పేర్కొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.