యాప్నగరం

కాళ్లూచేతులు కట్టి.. నోటికి ప్లాస్టర్ వేసి పిల్లలకు బలవంతంగా టాటూలు.. పేరెంట్స్ అరెస్ట్

పిల్లలకు పచ్చబొట్టు వేసే విషయంలో ఓ జంట క్రూరంగా ప్రవర్తించింది. వారికి కాళ్లూచేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేశారు. తమ పిల్లల పట్ల తల్లిదండ్రులు అత్యంత దారుణంగా వ్యవహరించిన ఈ ఘటన అమెరికాలోని టెక్సాస్‌లో చోటుచేసుకుంది. ఈ విషయం గురించి పోలీసులకు సమాచారం రావడంతో అరెస్ట్ నుంచి తప్పించుకోడానికి వాటిని తొలగించారు. ఈ క్రమంలో పిల్లలకు గాయాలయ్యాయి. దీంతో కేసు నమోదుచేసిన పోలీసులు.. వారిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 27 Apr 2023, 7:57 am

ప్రధానాంశాలు:

  • టాటూల కోసం పిల్లలను హింసించిన తల్లిదండ్రులు
  • చైల్డ్ ప్రొటెక్టివ్ సర్వీసెస్‌కు ఫిర్యాదు రావడంతో చర్యలు
  • ఇద్దర్నీ అరెస్ట్ చేసి జైల్లో వేసిన పోలీస్ అధికారులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Tattoo
తమ పిల్లలకు బలవంతంగా టాటూలు వేయించారనే ఆరోపణలపై తండ్రి, సవతి తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన అమెరికాలోని టెక్సాస్‌లో చోటుచేసుకుంది. పిల్లలకు బలవంతంగా టాటూలు వేయించినట్టు అధికారులకు తెలియడంతో వాటిని తొలగించడానికి ప్రయత్నించినట్టు న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. పోలీసుల కథనం ప్రకారం.. టెక్సాస్‌కు చెందిన మేగన్ మే ఫార్ (27), గన్నర్ ఫార్ (23)‌‌లు 9 ఏళ్లు, 5 ఏళ్ల పిల్లలను కట్టివేసి, బలవంతంగా టాటూలు వేయించారు. ఒకరికి పాదాలపై, మరో చిన్నారికి భుజంపై వేయించినట్టు తెలిపారు. పిల్లలను తాడుతో కట్టేసి, నోటికి టేప్‌ చుట్టి, కళ్లకు గంతలుకట్టి ఉంచినట్లు విచారణలో తేలింది.
అయితే, పిల్లలకు బలవంతంగా టాటాలు వేయించిన విషయాన్ని చైల్డ్ ప్రొటెక్టివ్ సర్వీసెస్ (CPS)కు తెలియడంతో రంగంలోకి దిగింది. ఈ విషయాన్ని సీపీఎస్ పరిశీలిస్తోందని తెలుసుకున్న దంపతులు.. ఆ టాటూలను బలవంతంగా తొలగించి అరెస్టు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. టాటాలు వేసిన చోట ‘కత్తిరించడం, స్క్రాప్ చేయడం, స్క్రబ్బింగ్’ చేయడం ద్వారా కవర్ చేయడానికి ప్రయత్నించారు. వాటిని నిమ్మరసంతో రుద్ది తొలగించినట్టు అధికారులు గుర్తించారు.

‘పచ్చబొట్టు వేసిన నిర్దిష్ట ప్రదేశంలో పిల్లలపై కనిపించే గాయాలు ఉన్నాయి.. టాటూ వేసిన చోట శరీరం నుంచి చర్మాన్ని తొలగించినట్లు కనిపించింది.. పిల్లల పట్ల క్రూరంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు సమయంలో ఇది జరిగింది’ అని జావల్లా పోలీస్ చీఫ్ లెఫ్టినెంట్. జేమ్స్ డెన్బీ కేటీఆర్ఈకి చెప్పారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన తల్లిదండ్రులపై కేసు నమోదుచేసి సోమవారం అరెస్ట్ చేశారు. మేగాన్ మే ఫార్‌, గన్నర్ ఫార్‌లపై పిల్లలను గాయపరచడం, చట్టవిరుద్దమన నిర్బంధానికి సంబంధించి రెండు అభియోగాలను నమోదుచేశారు. వారిని అరెస్ట్ చేసిన తర్వాత చిన్నారులను సీపీఎస్‌ సంరక్షణకు తరలించారు.



Read More Latest International News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.