ఇటలీ భారీ భూకంపం ఏర్పడిన సంగతి తెలిసిందే. భూకంపం ధాటికి సెంట్రల్ ఇటలీ చిగురుటాకులా వణికింది. వందల సంఖ్యలో ఇళ్లు, భవనాలు కుప్పకూలాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కోట్లలో ఆస్తి నష్టం సంభవించింది. నిలువ నీడలేక, ఆహార పానీయాలు లేక ప్రజలు రోడ్ల మీద కూర్చుని ఉన్నారు. శిథిలాల తొలగింపు కార్యక్రమం కొనసాగుతోంది. శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. ఇప్పటివరకు 21 మృతదేహాలు బయటపడ్డాయి. ఇంకా ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
21కి చేరిన ఇటలీ మృతుల సంఖ్య
ఇటలీ భారీ భూకంపం ఏర్పడిన సంగతి తెలిసిందే.
TNN 24 Aug 2016, 3:58 pm