యాప్నగరం

అమెరికా కాల్పుల్లో 50కి చేరిన మృతుల సంఖ్య

అమెరికాలోని కంట్రీ మ్యూజిక్ ఫెస్టివల్లో ఓ దుండగుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో మృతి చెందిన వారి సంఖ్య 50కి చేరగా

TNN 2 Oct 2017, 6:24 pm
లాస్‌వెగాస్‌లోని కంట్రీ మ్యూజిక్ ఫెస్టివల్లో ఓ దుండగుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో మృతి చెందిన వారి సంఖ్య 50కి చేరగా మొత్తం 200 మందికిపైగా గాయపడ్డారు. ఓ హోటల్లోని 32వ అంతస్తు నుంచి తుపాకీతో గుళ్లవర్షం కురిపించిన దుండగుడు అనంతరం పోలీసులు జరిపిన కాల్పుల్లో హతమయ్యాడు. దాడి తర్వాత మ్యూజిక్ ఫెస్టివల్ జరిగిన చోట ఎక్కడచూసినా మృతులు, క్షతగాత్రుల రక్తం మరకలే కనిపించడం స్థానికులని భయబ్రాంతులకి గురిచేశాయి. మృతుల సంఖ్య 50కి చేరడంతో ఈ దుర్ఘటనను దేశ చరిత్రలోనే అతి దారుణమైన ఊచకోతగా అమెరికన్స్ పరిగణిస్తున్నారు. గతేడాది ఓర్లాండో నైట్ క్లబ్‌లో జరిగిన దాడిలో అత్యధికంగా 49 మంది మృతిచెందగా లాస్ వెగాస్‌ కాల్పుల్లో మృతుల సంఖ్య అంతకన్నా ఎక్కువగా వుండటమే అందుకు కారణమైంది.
Samayam Telugu death toll rised to 50 in las vegas shootings
అమెరికా కాల్పుల్లో 50కి చేరిన మృతుల సంఖ్య


దుండుగుడికి ఎటువంటి టెర్రరిస్టు సంస్థలతో సంబంధం లేదని, అతడు ఒంటరిగానే ఈ దాడికి పాల్పడ్డాడని భావిస్తున్నామని క్లార్క్ కంట్రీ షెరిఫ్ జోసెఫ్ లాంబార్డో మీడియాకు తెలిపారు. ఈ దాడికి పాల్పడటం వెనుక అతడి ఉద్దేశం ఏంటో కూడా అర్థం కావడం లేదని అన్నారు లాంబార్డో. నిందితుడికి సంబంధం వున్నట్టుగా భావిస్తున్న ఓ మహిళను, మరో రెండు కార్లని పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.