యాప్నగరం

భారత్ ఆయుధాలు మాకు అవసరం: వియత్నాం

భారత్ నుంచి బ్రహ్మోస్ క్షిపణులు కొనుగోలు చేశామని చైనాకు షాకిచ్చిన వియత్నాం.. తాజాగా మరోసారి భారత్‌ను పొగుడుతూ మాట్లాడింది..

TNN 8 Sep 2017, 6:14 pm
దేశ భద్రత కోసం, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి ఇండియా నుంచి ఆయుధ సామాగ్రిని కొనుగోలు చేస్తూనే ఉంటామని వియత్నాం ప్రకటించింది. భారత్ నుంచి బ్రహ్మోస్ క్షిపణులు కొనుగోలు చేశామని ప్రకటించిన ఆ దేశం.. ఇటీవలే చైనాను కంగారెత్తించిన సంగతి తెలిసిందే. కాగా ఈ ప్రకటనను మన దేశం ఖండించింది. ఇండియాతో బలమైన రక్షణ సంబంధాలను కోరుకుంటున్నట్లు వియత్నాం తెలిపింది. దక్షిణ చైనా సముద్రంలోని చమురు, సహజ వాయువు నిక్షేపాలు ఉన్నాయి. వాటిని వెలికి తీయడంలో భారత్ మరింత మెరుగైన పాత్ర పోషించాలని కోరుకుంటునట్లు భారత్‌లోని వియత్నాం రాయబారి టాన్ సిన్హ్ థాన్హ్ టైమ్స్ ఆఫ్ ఇండియాకు తెలిపారు. దక్షిణ చైనా సముద్రం తమదేనని వాదిస్తోన్న చైనా అక్కడ భారత్ అడుగుపెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
Samayam Telugu defence supplies from india helpful vietnam
భారత్ ఆయుధాలు మాకు అవసరం: వియత్నాం


దక్షిణ చైనా సముద్రంలో చైనా కృతిమ దీవులను నిర్మిస్తోంది, సైనిక సంపత్తిని అక్కడ మోహరిస్తోంది. దీంతో ఆ ప్రాంతంలో స్వేచ్ఛగా సంచరించేందుకు వియత్నాం లాంటి దేశాలు భయపెడుతున్నాయి. ఈ విషయంలో అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పును కూడా చైనా లక్ష్యపెట్టడం లేదు. డోక్లాంలో వ్యవహరించిన రీతిలోనే డ్రాగన్ అక్కడ కూడా వ్యవహరిస్తోందని టాన్ తెలిపారు. బ్రహ్మోస్ క్షిపణుల కొనుగోలు విషయంలో తనకు స్పష్టమైన సమాచారం లేదని తెలిపిన ఆయన తమ రక్షణ కోసం భారత్‌ నుంచి ఆయుధాలను కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.