యాప్నగరం

మళ్లీ ఎబోలా వైరస్ పంజా..17మంది మృతి

ప్రపంచాన్ని గడగడలాడించిన ఎబోలా మళ్లీ విజృంభిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ఇప్పటి వరకు 17మంది చనిపోగా... మరికొంతమంది వ్యాధి లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరారు.

Samayam Telugu 9 May 2018, 4:30 pm
ప్రపంచాన్ని గడగడలాడించిన ఎబోలా మళ్లీ విజృంభిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ఇప్పటి వరకు 17మంది చనిపోగా... మరికొంతమంది వ్యాధి లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగాలో ఇది బయటపడగా... ఈ విషయాన్ని అక్కడి అధికారులు ధృవీకరించారు. బికోరో సమీపంలోని ఓ గ్రామంలో ఈ వైరస్ లక్షణాలతో నెల క్రితం 20మందికిపైగా ఆస్పత్రిలో చేరారు. వారికి పరీక్షలు నిర్వహించిన వైద్యులు... ఎబోలాగా తేల్చారట. వీరికి ప్రత్యేకంగా వార్డుల్ని ఏర్పాటు చేసి... వైద్యం అందించారు. అయితే ఈ రోగుల్లో 17మంది పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయారాట.
Samayam Telugu Ebola


కాంగాలో ప్రస్తుతం హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించారు. ప్రత్యేక వైద్య బృందాలను కూడా రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆస్పత్రుల్లోనూ ప్రత్యేకంగా వార్డులను సిద్ధం చేస్తున్నారట. అక్కడి అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఆఫ్రికా దేశాల్లోనే ఎబోలా బయటపడగా... రెండేళ్ల క్రితం పశ్చిమాఫ్రికా దేశాల్లో ఈ వైరస్‌ దెబ్బకు 11వేలకు మందిపైగా చనిపోయారు. మళ్లీ ఇప్పుడు కాంగోలో బయటపడటం కలకలంరేపుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.