యాప్నగరం

రెండు రైళ్లు ఢీ.. భారీగా ప్రాణ నష్టం

ఈజిప్ట‌ులో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో 44 మంది మరణించగా.. 180 మంది గాయపడ్డారు.

TNN 12 Aug 2017, 9:43 am
ఈజిప్ట్‌లోని అలెగ్జాండ్రియా నగరంలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో 44 మంది మరణించగా.. 180 మంది గాయపడ్డారు. శిథిలాల నుంచి క్షతగాత్రులను వెలికి తీసే ప్రక్రియ పూర్తయితే మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆ దేశ మంత్రి తెలిపారు. కైరో నుంచి అలెగ్జాండ్రియా వెళ్తున్న రైలు.. చిన్న స్టేషన్లో ఆగి వున్న మరో రైలును వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. శుక్రవారం రాత్రి ఈ దుర్ఘటన చేసుకోగా.. వెంటనే అప్రమత్తమైన సహాయక బృందాలు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించే పనిలో నిమగ్నమయ్యాయి.
Samayam Telugu egypt train accident kills 44 injures nearly 180
రెండు రైళ్లు ఢీ.. భారీగా ప్రాణ నష్టం


ప్రమాదంలో మరణించిన వారిలో స్త్రీలు, చిన్నారులే ఎక్కువ మంది ఉన్నారు. ప్రమాదం విషయం తెలుసుకున్న ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. 75 అంబులెన్స్‌లను అక్కడి పంపింది. రెండు రైళ్లు ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే సాంకేతిక కారణాల వల్ల రాజధాని కైరో నుంచి వస్తున్న రైలు ఆగి ఉండగా మరో రైలు వచ్చి ఢీకొట్టిందని రవాణాశాఖ పేర్కొంది. విచారణకు ఆదేశించినట్లు ఆశాఖ మంత్రి తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరగనుందని సమాచారం.

గత ఏడాది కైరోలో రైలు పట్టాలు తప్పడంతో ఐదుగురు మరణించగా, 27 మంది గాయపడ్డారు. 2012లో రైలు స్కూలు బస్సును ఢీకొనడంతో 51 మంది ప్రాణాలు వదిలారు. 2002లో ఈజిప్టులో జరిగిన భారీ రైలు ప్రమాదంలో 360 మంది ప్రాణాలు గాల్లో కలిశాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.