యాప్నగరం

ప్రార్థనామందిరంపై కాల్పులు, ఐదుగురి మృతి

కెనడాలోని ఆదివారం ఓ ప్రార్థనామందిరంలో దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఐదురుగు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం

Samayam Telugu 30 Jan 2017, 9:19 am
కెనడాలోని ఆదివారం ఓ ప్రార్థనామందిరంలో దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఐదురుగు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఆగంతకులు కాల్పులు జరిపిన సమయంలో మందిరంలో 40మంది దాకా ఉన్నట్లు తెలిసింది. ఇందులో ఎంతమంది గాయపడ్డారో తెలియరాలేదు. మందిరంపై కాల్పులు జరిపిన వెంటనే పోలీసులు పట్టణంలో భద్రత కట్టుదిట్టం చేశారు.
Samayam Telugu five killed in shooting at mosque in quebec canada
ప్రార్థనామందిరంపై కాల్పులు, ఐదుగురి మృతి


క్యూబెక్ సిటీలోని ఇస్లామిక్ కల్చరల్ సెంటర్ పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. మందిరంలో 40మంది ప్రార్థనలో పాల్గొన్నప్పుడు ఈ కాల్పులు జరిగాయి.
అయితే ఈ కాల్పులకు తెగబడింది ఎవరో ఇంకా తెలియరాలేదు.

గత ఏడాది జూన్ లో పందిని చంపి దాని తలను ఈ సెంటర్ ముఖ ద్వారం వద్ద దుండగలు విసిరేసారు. 2013లో కెనడా ప్రభుత్వం ముస్లింలు ముఖం కనిపించకుండా ఎలాంటి మాస్కులు ధరించరాదని నిషేదం విధించింది. అప్పటి నుంచి ఈ దేశంలో ముస్లింల హక్కులపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది.

అటు ఏడు ముస్లిం దేశాలపై అమెరికా నిషేదం విధించిన వారికి..తమ దేశంలో ఆశ్రయం కల్పిస్తామని కెనడా స్వాగతం పలికిన మరుసటి రోజే ఈ దాడి జరగడం గమనార్హం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.