యాప్నగరం

అయోధ్య రాణి వారసుడు.. కొరియా మాజీ ప్రధాని కన్నుమూత

అనారోగ్యంతో చికిత్స పొందుతూ దక్షిణ కొరియా మాజీ ప్రధాని కిమ్ జాంగ్ పిల్ కన్నుమూశారు. ఆయనకు అయోధ్యతో విడదీయరాని అనుబంధం ఉంది.

Samayam Telugu 23 Jun 2018, 9:11 am
దక్షిణ కొరియా మాజీ ప్రధాన మంత్రి కిమ్ జాంగ్ పిల్ (92) శనివారం కన్నుమూశారు. సియోల్‌లోని సూనుచున్‌హ్యంగ్ యూనివర్సిటీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. 1961 తిరుగుబాటు సమయంలో కిమ్ కీలక పాత్ర పోషించారు. ప్రధానిగా ఎన్నిక కావడానికి ముందు ఆయన కొరియన్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీని ఏర్పాటు చేసి, దాని బాధ్యతలను పర్యవేక్షించారు.
Samayam Telugu kimg jong pil


కిమ్ జాంగ్‌ పిల్‌కు భారత్‌తో విడదీయరాని అనుబంధం ఉంది. 2001లో ఆయన అయోధ్య రాజ వంశీయుడైన భిమ్‌లేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రాకు లేఖ రాశారు. అదే ఏడాది మార్చిలో చేపట్టిన భారత పర్యటన తనకెంతో ప్రత్యేకమని కిమ్ తెలిపారు. అయోధ్యలో పర్యటించాలనే నా కోరిక నెరవేరిందని కిమ్ చెప్పారు.

క్రీ.శ.48లో అయోధ్యకు చెందిన సూరి రత్న అనే యువరాణి పడవలో ప్రయాణించి కొరియా చేరుకుంది. అక్కడి గయ రాజ్య పాలకుడైన కింగ్ సురోను పెళ్లాడింది. వీరి వారసుల్లో నేను 72వ తరానికి చెందిన వాణ్నని కొరియా ప్రధానిగా పని చేస్తున్న సమయంలో కిమ్ చెప్పుకొచ్చారు. అందుకే ఆయనకు అయోధ్య అంటే ప్రత్యేక అభిమానం. చాలా మంది కొరియన్లు ఇప్పటికీ అయోధ్యను తమ పుట్టినిల్లుగా భావిస్తారు. అందుకే ఏటా వందలాది మంది కొరియన్లు అయోధ్యను సందర్శిస్తుంటారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.