యాప్నగరం

Masood Azharకు వ్యతిరేకంగా.. భారత్‌కు బాసటగా రంగంలోకి ఫ్రాన్స్

పుల్వామా ఉగ్రదాడులకు పాల్పడిన జైషే మహ్మద్ అధినేత మసూద్ అజహర్‌కు వ్యతిరేకంగా ఫ్రాన్స్ రంగంలో దిగుతోంది. భారత్‌కు బాసటగా ఐరాసలో ఫ్రాన్స్ నిలవనుంది. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే ప్రతిపాదనను ఐరాసలో ప్రవేశపెట్టనుంది.

Samayam Telugu 19 Feb 2019, 8:03 pm
పుల్వామా ఉగ్రదాడి ఘటన తర్వాత భారత్‌‌కు మద్దతుగా ఫ్రాన్స్ రంగంలోకి దిగుతోంది. ఈ ఉగ్రదాడికి జైషే మహ్మద్ బాధ్యత ప్రకటించినప్పటికీ ఆ సంస్థ చీఫ్ మసూద్ అజహర్‌కు చైనా వత్తాసు పలుకుతున్న సంగతి తెలిసిందే. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా ఐరాసలో చైనా అడ్డు తగులుతోంది. వీటో అధికారంతో డ్రాగన్ భారత్‌ ప్రతిపాదనకు మోకాలడ్డుతోంది. ఈ నేపథ్యంలో మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే ప్రతిపాదనను ఐరాసలో ఫ్రాన్స్ ముందుకు తీసుకెళ్లనుంది.
Samayam Telugu masood-azhar


ఫ్రాన్స్ గతంలోనూ ఐరాసలో మసూద్ అజహర్‌పై నిషేధం అంశాన్ని ప్రతిపాదించింది. 2017లో బ్రిటన్, ఫ్రాన్స్ మద్దతుతో అమెరికా ఈ ప్రతిపాదనను ఐరాస ఆంక్షల కమిటీ ముందుకు తీసుకొచ్చింది. కానీ మసూద్ అజహర్‌పై అంతర్జాతీయంగా నిషేధం విధించకుండా చైనా అడ్డు తగిలింది.

మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించి, అతడిపై నిషేధం విధించడం కోసం మరి కొద్ది రోజుల్లో ఫ్రాన్స్ ఈ ప్రతిపాదనన ఐరాసలో ప్రవేశపెడుతుందని ఫ్రెంచ్ వర్గాలు తెలిపాయి. ఈ విషయమై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, ఫ్రాన్స్ అధ్యక్షుడి దౌత్య సలహాదారు ఫిలిప్పె ఎటిన్నేతో మంగళవారం ఉదయం చర్చించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.