యాప్నగరం

ప్రపంచవ్యాప్తంగా 60 వేలు దాటిన కరోనా మరణాలు

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మరణాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. రెండు రోజులకు పదివేల మంది చొప్పున ఈ మహమ్మారికి జనం బలి అవుతున్నారు.

Samayam Telugu 4 Apr 2020, 10:31 pm
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 60 వేలు దాటింది. ఏప్రిల్ 2న 50 వేలకు చేరిన కోవిడ్ మరణాలు.. రెండు రోజుల్లోనే మరో పదివేలకుపైగా పెరిగాయి. ప్రస్తుతం కరోనాకు బలైన వారి సంఖ్య 62 వేలకు చేరువలో ఉండగా.. యూరప్ దేశాల్లోనే 40 వేల మందికిపైగా కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకూ ఇటలీ, స్పెయిన్, అమెరికా, బ్రిటన్‌లలో అత్యధిక కోవిడ్ మరణాలు చోటు చేసుకున్నాయి. ఇటలీలో 14,681 మంది కరోనా మహమ్మారికి బలి కాగా.. స్పెయిన్‌లో 11,198 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు దేశాల్లోనూ కోవిడ్ బాధితుల సంఖ్య 1.20 లక్షలకు చేరువలో ఉంది.
Samayam Telugu corona death


మరోవైపు అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య దాదాపు 2.8 లక్షలకు చేరింది. ఇప్పటి వరకూ కోవిడ్ బారిన పడి అమెరికాలో 7400 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఫ్రాన్స్‌లో 6500 మందికిపైగా కరోనా బారిన పడి చనిపోగా.. ఇక్కడ 644 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. బ్రిటన్లోనూ కరోనా మరణాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇక్కడ 4300 మందికిపైగా కోవిడ్‌కు బలయ్యారు.

Read Also: తెలంగాణలో 272కు చేరిన కరోనా కేసులు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.