యాప్నగరం

గ్రీసులో కార్చిచ్చు.. 77 మంది దుర్మరణం

గ్రీస్‌ రాజధాని ఏథెన్స్‌ సమీపంలోని రిసార్ట్‌ టౌన్‌ మాటీను కార్చిచ్చు వణికించింది. ఏథెన్స్‌కు 40 కి.మీ. దూరంలో ఉన్న మాటీలో సోమవారం నుంచి మంగళవారం వరకు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

Samayam Telugu 25 Jul 2018, 2:20 pm
గ్రీస్‌ రాజధాని ఏథెన్స్‌ సమీపంలోని రిసార్ట్‌ టౌన్‌ మాటీను కార్చిచ్చు వణికించింది. ఏథెన్స్‌కు 40 కి.మీ. దూరంలో ఉన్న మాటీలో సోమవారం నుంచి మంగళవారం వరకు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గాలుల తీవ్రతకు మంటలు ఎగిసి పడటంతో.. దట్టమైన పొగ, మంటల కారణంగా 77 మంది మృతి చెందారు. ఈ సంఖ్య వందకు చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Samayam Telugu greece


ఊహించని అగ్ని ప్రమాదంతో అట్టి ప్రాంతంలో ఎమర్జెన్సీని ప్రకటించారు. వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమించారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో.. గ్రీస్ ప్రధాని యూరోపియన్ దేశాల సాయం కోరారు. తక్షణమే స్పందించిన జర్మనీ, పొలాండ్, ఇటలీ, ఫ్రాన్స్‌లు మంటలు అదుపు చేయడానికి విమానాలు, ఫైటర్ జెట్లను పంపాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో.. చాలా మంది పక్కనే ఉన్న సముద్రంలో దూకి ప్రాణాలు కాపాడుకున్నారు.

మంటల్ని అదుపులోకి తెచ్చినా.. పదే పదే అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయని గ్రీస్‌ అధికారులు వెల్లడించారు. కార్చిచ్చు కారణంగా వందల ఇళ్లు, కార్లు, ఇతర వాహనాలను కాలిపోయాయి. పర్యాటక ప్రాంతం కావడంతో స్థానికులే కాకుండా.. విదేశీ పర్యాటకులు అగ్నికీలలకు బలయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.