యాప్నగరం

Russia: పాఠశాలలో దుండగుడి కాల్పులు.. 9 మంది మృతి

Gunman Firing in School: రష్యాలో ఓ పాఠశాలలో విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ దుర్ఘటనలో 9 మంది మరణించినట్లు తెలుస్తోంది. కాల్పుల్లో మరో 20 మంది గాయపడ్డారు. మృతి చెందిన వారిలో విద్యార్థులు, టీచర్లు ఉన్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. సెంట్రల్ రష్యాలోని ఇజెవ్‌స్క్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. దాడి జరిగిన సమయంలో పాఠశాలలో 1000 మంది విద్యార్థులు, 80 మంది టీచర్లు ఉన్నారు.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 26 Sep 2022, 3:38 pm
ష్యాలో (Russia) ఓ పాఠశాలను లక్ష్యంగా చేసుకొని దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ దుర్ఘటనలో 9 మంది మరణించినట్లు తెలుస్తోంది. కాల్పుల్లో మరో 20 మంది గాయపడ్డారు. మృతి చెందిన వారిలో విద్యార్థులు, టీచర్లు ఉన్నారు. సెంట్రల్ రష్యాలోని ఇజెవ్‌స్క్‌లో సోమవారం (సెప్టెంబర్ 26) ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. పాఠశాలపై దాడి జరిగిన సమయంలో 1000 మంది విద్యార్థులు, 80 మంది టీచర్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఘటనకు సంబంధించిన సమాచారం అందగానే భద్రతా దళాలు ఆ పాఠశాలను చుట్టుముట్టాయి. అక్కడి నుంచి విద్యార్థులు, టీచర్లందరినీ తరలించాయి. పాఠశాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.
Samayam Telugu Russia gunman shooting
రష్యా దుండగుడి కాల్పులు


ముఖానికి ముసుగు వేసుకొని వచ్చిన దుండగుడు తొలుత పాఠశాల గేట్ వద్ద ఉన్న గార్డును హత్య చేశాడు. ఆ తర్వాత పాఠశాలలోకి ప్రవేశించి విద్యార్థులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఆ సమయంలో క్లాసులు జరుగుతుండటంతో పాఠశాల గదులు కిక్కిరిసిపోయి ఉన్నాయి. కాల్పుల శబ్దం విని విద్యార్థులు, టీచర్లు బల్లల కింద దాక్కొని ప్రాణాలు రక్షించుకున్నారు.

గాయపడిన విద్యార్థిని తీసుకొని గదిలో దాక్కున్న ప్రధానోపాధ్యాయురాలు
గాయపడిన ఓ విద్యార్థిని తీసుకొని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఓ గదిలో దాక్కున్నారు. తరగతి గదులు రక్తపు మరకలతో భీతావహంగా మారిపోయాయి. విచక్షణా రహితంగా కాల్పులకు పాల్పడిన అనంతరం ఆ దుండగుడు నాలుగో అంతస్తుకు వెళ్లి తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రష్యా మీడియా కథనాల్లో పేర్కొన్నారు. కాల్పుల్లో గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.