యాప్నగరం

అమెరికా నిషేదం విధిస్తే పాకిస్థాన్‌కే లాభం!

అమెరికా తమ దేశంపై నిషేదం విధిస్తే, వీసాలపై ఆంక్షలు విధిస్తే అది తమకే లాభిస్తుందని పాకిస్థాన్ నేత,

Samayam Telugu 30 Jan 2017, 10:56 am
అమెరికా తమ దేశంపై నిషేదం విధిస్తే, వీసాలపై ఆంక్షలు విధిస్తే అది తమకే లాభిస్తుందని పాకిస్థాన్ నేత, పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ అన్నారు. తమ పౌరులను అమెరికా రానీయకుండా నిషేదం ఉంటే అప్పుడు వారు ఎటు వెళ్లకుండా సొంత దేశాన్ని అభివృద్ధి చేసుకుంటారని ఆయన పేర్కొన్నారు.
Samayam Telugu if america bans pak it will help us develop the country says imran khan
అమెరికా నిషేదం విధిస్తే పాకిస్థాన్‌కే లాభం!


‘‘వీసాల జారీ విషయంలో పాకిస్థాన్ అమెరికా నుంచి కఠిన నిబంధనలు (నిషేదం) ఎదుర్కొవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. అధ్యక్షుడు ట్రంప్ మా దేశ పౌరులకు వీసాలు మంజూరు చేయకుండా చట్టం చేయాలని ప్రార్థిస్తున్నా. అప్పుడైనా మా దేశం అభివృద్ధి జరుగుతుంది’’ అని ఇమ్రాన్ పీటీఐ నిర్వహించిన ఓ సమావేశంలో అన్నారు.

అయితే అమెరికా పాకిస్థాన్ పై ఆంక్షలు విధిస్తే..తాము కూడా అమెరికా దేశస్థులపై ఆంక్షలు విధించకతప్పదని ఆయన స్పష్టం చేశారు. పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీప్ తలనొప్పి వచ్చినా చికిత్స కోసం అమెరికా వెళ్తారని..వీసాపై ఆదేశం నిషేదం విధిస్తే కనీసం అప్పుడైనా ప్రధాని దేశాభివృద్ధిపై దృష్టిసారిస్తారని ఇమ్రాన్ ఎద్దేవా చేశారు.

ఇండో –పాక్ సంబంధాలపై మాట్లాడిన ఆయన పాకిస్థాన్ ప్రజలు నవాజ్ షరీప్ లా పిరికివారు కాదని భారత ప్రధాని మోదీకి గుర్తు చేస్తున్నామన్నారు. ఇరుదేశాల్లో మెజార్టీ ప్రజలు భారత్-పాక్ ల మధ్య యుద్ధం కోరుకోవడం లేదని అభిప్రాయపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.