యాప్నగరం

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి: ఒబామా

ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేయాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అమెరికా ప్రజలు, ప్రపంచానికి పిలుపునిచ్చారు.

TNN 11 Jan 2017, 9:52 am
ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేయాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అమెరికా ప్రజలు, ప్రపంచానికి పిలుపునిచ్చారు. అమెరికా అధ్యక్షుడిగా ఒబామా చికాగోలో ప్రజలనుద్దేశించి చివరి సారిగా ప్రసంగించారు.
Samayam Telugu in last speech as us president obama warns against racism anti immigrant anti muslim sentiment under trump
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి: ఒబామా


దాదాపు గంటపాటు వీడ్కోలు ప్రసంగం చేసిన ఒబామా..తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. రెండు దఫాలు (ఎనిమిది సంవత్సరాలు) అమెరికాకు అధ్యక్షుడిగా కొనసాగిన ఒబామా... తనకు వీలైనంతగా రాజ్యాంగ పరిరక్షణకు, ప్రజల సంక్షేమం కోసం కృషి చేశానని చెప్పారు.

‘వివక్షకు వ్యతిరేకంగా అందరం పోరాడాలి. తీవ్రవాదంపై ఉమ్మడి పోరు అవసరం’’ అని నొక్కి చెప్పారు. వివక్షకు తావుండకూడదనే తాను అమెరికన్ ముస్లింలకు అండగా నిలిచానని అన్నారు. మానవ హక్కులు, మహిళా హక్కులు, ప్రజాస్వామ్యం, ఎల్జీబీటీ కమ్యూనిటీ హక్కుల పరిరక్షణకు తనవంతుగా కృషి చేశానని ఆయన పేర్కొన్నారు.

తాను ప్రవేశపెట్టిన కొన్ని పథకాలు సరిగ్గా అమలు కాలేదని అందుకే తానో లేమ్ డక్ గా అవర్ణించుకున్నారు ఒబామా.

ఆర్థిక, సామాజిక న్యాయం కొందరికే కాకుండా అందరికీ దక్కాలని ఆయన ఆకాంక్షించారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ పై పరోక్షంగా ఒబామా పలు విమర్శలు చేశారు.

ఐఎస్ఐఎస్ వంటి తీవ్రవాద సంస్థలతో రాజీలేని పోరాటం చేయాలని అవి అమెరికా రాజ్యాంగాన్ని ఓడించాలని చూస్తున్నాయని అది జరగని పని అని ఒబామా అన్నారు. చైనా, రష్యాలు అమెరికాను అన్ని రంగాల్లో ఓడించాలని చూస్తున్నాయని..భద్రతవిషయంలో, అతిజాగ్రత్తగా మెలగాలని ట్రంప్ కు సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.