యాప్నగరం

ప్రపంచ ఓపెన్ ఎకానమీగా భారత్: మోడీ

ప్రధాని మోడీ మూడు రోజుల పాటూ జపాన్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.

TNN 11 Nov 2016, 2:05 pm
ప్రధాని మోడీ మూడు రోజుల పాటూ జపాన్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. శుక్రవారం అక్కడ జరిగిన ‘ఇండియా - జపాన్ బిజినెస్ లీడర్స్ ఫోరం’ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. భారత్ ను ప్రపంచంలోనే ఓపెన్ ఎకానమీగా మార్చాలన్నదే తన లక్ష్యంగా చెప్పారు. తమ ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోందన్నారు. భారత్‌ను పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైన దేశంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా భారత జీఎస్టీ ప్రొగ్రెస్‌ను, పెట్టుబడుల పాలసీలలో చేసిన అనుకూల మార్పులను, నియమాలను మోడీ సదస్సులో వివరించారు.
Samayam Telugu india aims to be worlds most open economy says pm modi in japan
ప్రపంచ ఓపెన్ ఎకానమీగా భారత్: మోడీ


ఆర్థిక సంస్కరణల విషయంలో భారత్ మరింతగా దూసుకుపోతోందని అన్నారు. జపాన్ లోని హార్డ్ వేర్, భారత్ లోని సాఫ్ట్ వేర్ కలిస్తే అద్భుతాలు ఆవిష్కరించవచ్చని అన్నారు. విదేశీ పెట్టుబడుల ఈక్విటీ ఇన్ ఫ్లోలు రెండేళ్లలో యాభైశాతానికి పైగా పెరిగాయని మోడీ వివరించారు. ఈ సందర్భంగా భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ వాణిజ్య సంస్థలను ఆహ్వానించారు.

జపాన్ మాజీ ప్రధాని యొషిరో మోరి టోక్యోలో ప్రధాని మోడీని గౌరవార్థం కలిశారు. కాసేపు ముచ్చటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.