యాప్నగరం

సరిహద్దుల్లో ఉద్రిక్తతలు.. 5 అంశాల ప్రణాళికకు భారత్ చైనా అంగీకారం

భారత్ చైనా సైనికల బలగాల మధ్య ఉద్రిక్తతలను తొలగించడం కోసం ఐదు అంశాల ప్రణాళికకు ఇరు దేశాలు అంగీకారం తెలిపాయి.

Samayam Telugu 11 Sep 2020, 7:39 am
భారత్, చైనా మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తొలగించే దిశగా కీలక ముందడుగు పడింది. ఇరు దేశాలు ఐదు అంశాల ప్రణాళిక ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి అంగీకరించాయి. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు సందర్భంగా.. భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్, చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యి గురువారం సాయంత్రం భేటీ అయ్యారు. ఈ చర్చల సందర్భంగా ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని ఇరు దేశాల మంత్రులు నిర్ణయించారు.
Samayam Telugu s jaishankar Wang yi


శుక్రవారం తెల్లవారుజామున విదేశాంగ శాఖ ఈ విషయమై ఓ ప్రకటన జారీ చేసింది. ఇరు దేశాల విదేశాంగ శాఖ మంత్రుల మధ్య జరిగిన నిర్మాణాత్మక చర్చల్లో ఐదు అంశాల పట్ల అంగీకారం కుదిరినట్లు వెల్లడించింది. ‘‘సరిహద్దుల్లోని ప్రస్తుత పరిస్థితులు రెండు దేశాలకూ ప్రయోజనం కలిగించివని విదేశాంగ మంత్రులు అభిప్రాయపడ్డారు. ఇరు దేశాల మధ్య సైనిక చర్చలు కొనసాగాలి.. త్వరిగతిన బలగాల ఉపసంహరణ జరగాలి.. ఇరు దేశాల సైన్యం మధ్య తగిన దూరం పాటించాలి.. ఉద్రిక్తతలను తగ్గించుకోవాల’’ని ఈ సమావేశంలో నిర్ణయించారని విదేశాంగ శాఖ ప్రకటించింది.

విబేధాలను వివాదాలుగా మారకుండా చూసుకోవాలని ఇరు దేశాల సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. 2018, 2019ల్లో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య జరిగిన రెండు ఇష్టాగోష్టి సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని నిర్ణయించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.