యాప్నగరం

1962 కంటే చిత్తుగా ఓడిస్తాం.. భారత్‌కు చైనా పత్రిక హెచ్చరిక

భారత్ కంటే చైనా బలం ఎన్నో రెట్లు ఎక్కువ. ఏ విషయంలోనూ పొరుగు దేశంతో చైనాతో సాటి రాలేదు. కానీ అమెరికా అండ చూసుకొని కయ్యానికి కాలు దువ్వుతోందని.. యుద్ధం వస్తే 1962 కంటే చిత్తుగా ఓడిస్తామని చైనా పత్రిక వ్యాఖ్యానించింది.

Samayam Telugu 2 Sep 2020, 11:26 am
భారత్, చైనా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ.. చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ మన దేశాన్ని హెచ్చరిస్తూ ఎడిటోరియల్‌ను ప్రచురించింది. భారత్ యుద్ధానికి సిద్ధపడితే.. 1962 యుద్ధం కంటే చిత్తుగా ఓటమి తప్పదని గ్లోబల్ టైమ్స్ తన ఎడిటోరియల్ ద్వారా హెచ్చరించింది. పాంగాంగ్ త్సో సరస్సు సమీపంలో చైనా బలగాల ఆక్రమణను భారత్ తిప్పికొట్టి నేపథ్యంలో.. చైనా పత్రిక ఇలా ఎడిటోరియల్ ద్వారా హెచ్చరించడం గమనార్హం.
Samayam Telugu india china


90 శాతం మంది చైనీయులు భారత్‌పై ప్రతీకార చర్యకు దిగడానికి అనుకూలంగా ఉన్నారని గత వారమే గ్లోబల్ టైమ్స్ ఓ ‘సర్వే’ను ప్రచురించింది. ‘చైనా ప్రభుత్వం ఎప్పుడూ భారత్‌ను రెచ్చగొట్టాలని అనుకోవడంలేదు. కానీ చైనా భూభాగాన్ని ఆక్రమిస్తుంటే చూస్తూ ఊరుకోవద్దని’ 90 శాతం మంది చైనీయులు అభిప్రాయపడినట్లు గ్లోబల్ టైమ్స్ తెలిపింది.

‘తప్పనిసరి పరిస్థితుల్లో’ భారత్‌పై సైనిక చర్యకు దిగాలని కోరుతున్నట్లుగా గ్లోబల్ టైమ్స్ కథనాలు ఉంటున్నాయి. ‘భారత్ కంటే చైనా అనేక రెట్లు బలమైంది. చైనాకు పొరుగు దేశం సాటి రాదు. అమెరికా లాంటి ఇతర శక్తులతో కుమ్మక్కై మనల్ని ఎదిరించగలమన్న భారత్ భ్రమలను చిన్నాభిన్నం చేయాలి. సరిహద్దు సమస్య విషయంలో భారత్ అవకాశవాది’ అని గ్లోబల్ టైమ్స్ వ్యాఖ్యానించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.