ఐక్యరాజ్య సమితిలో పాక్కు భారత్ ధీటుగా జవాబిచ్చింది. బుర్హాన్ ఎన్కౌంటర్ బుటకమని.. భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని పాక్ ఐరాసాలో భారత్ పై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి వేదికగా మానవహక్కులపై చర్చ సందర్భంగా యూఎస్కు భారత అంబాసిడర్ సయ్యద్ అక్బరుద్దీన్ పాక్ ను కడిపారేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న బుర్హాన్ ను మట్టుబెట్టామని.. ఇందులో ఎలాంటి మానవహక్కుల ఉల్లంఘన జరగలేదని భారత్ తరఫున ఆయన వివరణ ఇచ్చారు. ఈ విషయంలో అమెరికా కూడా ..ఇది భారత్ అంతర్గత వ్యవహారమని ఇందులో తమ జోక్యం ఉండబోదని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తూ.. పాక్ ఎందుకో తమ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చేందుకు అంతగా ఆసక్తి కనబరుస్తుందో అర్థంకావడం లేదని దయ్యబట్టారు. ఉగ్రవాదం పట్ల పాక్ వైఖరి ఎలాఉందనే విషయం ఈ ఫిర్యాదుతో ప్రపంచానికి అర్థమైందని ఆయన ఎదురుదాడి చేశారు. పాక్ చర్యలు భారత్ సహా ప్రపంచ దేశాలు ఖండించాల్సిన అవసరముందన్నారు. పాక్ తన కుఠిల ప్రయత్నాలు మాని ఉగ్రవాదం పై ఉక్కుపాదం మొపుతున్న భారత్ కు సహకరించాలని భారత యూఎస్ అంబాసిడర్ సయ్యద్ అక్బరుద్దీన్ హితవు పలికారు.
ఐరాసాలో పాక్కు భారత్ ధీటైన జవాబు
మానవ హక్కల పై ఐక్యరాజ్యసమితి వేదికగా జరిగిన చర్చలో భారత యూఎస్ అంబాసిడర్ పాక్ ను కడిపారేశారు.
TNN 14 Jul 2016, 1:39 pm