యాప్నగరం

భారత్ రష్యాల మధ్య రూ.72,000 కోట్ల డిఫెన్స్ డీల్‌

గోవాలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భారత ప్రధానిమంత్రి నరేంద్రమోదీ సమావేశమై పలు చర్చలు నిర్వహించారు.

TNN 15 Oct 2016, 11:30 pm
గోవాలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భారత ప్రధానిమంత్రి నరేంద్రమోదీ సమావేశమై పలు చర్చలు నిర్వహించారు. అనంతరం ఇరుదేశాల మధ్య 72,000 కోట్ల రూపాయల డిఫెన్స్ డీల్‌ కుదిరింది. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా దేశాల అధినేతలు గోవాకు వచ్చిన సంగతి తెలిసిందే. రష్యా అధ్యక్షుడితో భేటీ అనంతరం చైనా అధ్యక్షుడు జింగ్‌పింగ్‌ ను మోదీ కలుసుకున్నారు. ఇటీవలికాలంలో వరుస ఉగ్రవాద దాడులపై భారత్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నా చైనా పాకిస్థాన్‌ కు మద్దతునిస్తోంది. ఈ నేపథ్యంలో జింగ్‌పింగ్‌ తో ప్రధాని మోదీ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ తో జరిపిన సమావేశం విజయవంతమైనట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇరుదేశాల మధ్య సంబంధాలపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగినట్టు ప్రధాని వెల్లడించారు. భారత్, చైనాలు రెండూ ఉగ్రవాద బాధిత దేశాలేనని, ఇది ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తోందని మోదీ జిన్‌పింగ్ దృష్టికి తీసుకువచ్చారు. ఇక ఉగ్రవాదాన్ని కీలక అంశంగా ఇరుదేశాలు గుర్తించాయి. ఇరుదేశాల భద్రత, భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని జిన్‌పింగ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. పాకిస్థానీ ఉగ్రవాది మసూద్‌ అజార్‌ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలన్న భారత తీర్మానానికి చైనా ఇటీవల ఐరాసలో మోకాలడ్డింది. సమావేశంలో ఈ విషయంపై కూడా చర్చ జరిగింది. మసూద్ అజహర్ అంశంతో సహా పలు అంశాలపై రెండు దేశాల మధ్య చర్చలు కొనసాగించేందుకు చైనా సముఖత వ్యక్తం చేసింది. ఎన్‌ఎస్‌జీలో సభ్యత్వం కోసం తాము చేస్తున్న ప్రయత్నం కార్యరూపం దాల్చేందుకు చైనాతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు మోదీ ఈ సమావేశంలో జిన్‌పింగ్‌ కు వివరించారు.
Samayam Telugu india russia ink pacts that will lead to defence deals worth rs 72000 crore
భారత్ రష్యాల మధ్య రూ.72,000 కోట్ల డిఫెన్స్ డీల్‌

My meeting with President Xi Jinping was fruitful. We discussed various aspects of India-China ties. pic.twitter.com/W9MxEvRbrg— Narendra Modi (@narendramodi) October 15, 2016

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.