యాప్నగరం

పాకిస్థాన్‌పై భారత్ ప్రతీకార దాడి.. 12 మంది హతం

ముగ్గురు భారత సైనికులను హతమార్చినందుకు ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ పాక్‌పై విరుచుకుపడింది. శత్రు దేశానికి భారీ స్థాయిలో నష్టం కలిగించింది.

TNN 24 Nov 2016, 8:32 am
ముగ్గురు భారత సైనికులను హతమార్చినందుకు ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ పాక్‌పై విరుచుకుపడింది. ఈ దాడిలో శత్రు దేశానికి భారీ స్థాయిలో నష్టం వాటిల్లింది. భారత సైన్యం జరిపిన ప్రతీకార దాడుల్లో పాక్ కెప్టెన్‌తోపాటు ముగ్గురు సైనికులు సహా 9 మంది పాకిస్థానీయులు మరణించినట్లు తెలుస్తోంది. భారత ఆర్మీ జరిపిన కాల్పుల్లో పాక్ ఆక్రమిత కశ్మీర్లోని నీలం లోయలో బస్సులో ప్రయాణిస్తున్న 9 మందికి గాయాలయ్యాయి. మచిల్ సెక్టార్‌లో భారత సైనికుడి శరీరాన్ని పాక్ ఉగ్రవాదులు ముక్కలు ముక్కలుగా నరికివేయడంతో ఇండియన్ ఆర్మీ తీవ్ర ప్రతీకారంతో రగిలిపోయింది. దీంతో వాస్తవాధీన రేఖ వెంబడి పాకిస్థాన్ పోస్టులే లక్ష్యంగా కాల్పులకు దిగింది.
Samayam Telugu indian army revenge attack on pakistan along loc12 pakistanis killed
పాకిస్థాన్‌పై భారత్ ప్రతీకార దాడి.. 12 మంది హతం


భారత్ కాల్పుల్లో కెప్టెన్ సహా ముగ్గురు సైనికులు మరణించారని, 9 మంది సాధారణ ప్రజలు చనిపోయారని పాకిస్థాన్ ప్రకటించింది. మచిల్, కీరాన్, గురేజ్ సెక్టార్లలో జనావాసాలే లక్ష్యంగా పాక్ కాల్పులు జరిపిందని భారత్ ఆరోపించింది. కిషన్ గంగా ప్రాజెక్టుకు అత్యంత చేరువలో పాకిస్థాన్ ప్రయోగించిన మోర్టార్ షెల్స్ లభించాయి. దీంతో అక్కడ పని చేస్తున్నవారు సొరంగాల్లో తలదాచుకున్నారు.

భారత సైన్యం కాల్పులతో అప్రమత్తమైన పాకిస్థాన్ డీజీఎంవో (డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్) మేజర్ జనరల్ సహీర్ షంషద్ మిజ్రా భారత డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్‌తో హాట్‌లైన్ ద్వారా చర్చలు జరిపారు. పాకిస్థాన్‌లోని సాధారణ ప్రజలు కూడా మరణించారని మిజ్రా రణబీర్‌కు తెలిపారు. పాక్ కాల్పుల్లో భారత ప్రజలు, సైనికులకు వాటిల్లిన ప్రాణనష్టం గురించి రణబీర్ పాక్‌ డీజీఎంవోకు తెలిపారు. భారత్‌లో ఉగ్రవాదుల చొరబాటు యత్నాలను ఆయన ప్రస్తావించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.