యాప్నగరం

అమెరికా వెళ్లనున్న ఇండియన్ ఐటీ సంస్థల బాసులు

భారత్‌లోని ప్రముఖ ఐటీ సంస్థల చీఫ్ ఎగ్జిక్యూటీవ్స్ అందరూ ఈ నెలాఖరున అమెరికా ప్రయాణం కానున్నారు.

TNN 3 Feb 2017, 10:02 am
భారత్‌లోని ప్రముఖ ఐటీ సంస్థల చీఫ్ ఎగ్జిక్యూటీవ్స్ అందరూ ఈ నెలాఖరున అమెరికా ప్రయాణం కానున్నారు. H-1B వీసాలపై కఠినతరమైన ఆంక్షలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా తమ ఐటీ సంస్థలు ఎదుర్కునే ఇబ్బందులని అమెరికా ప్రభుత్వానికి వివరించేందుకు సిద్ధమవుతున్నారు ఇండియన్ ఐటీ సంస్థల బాసులు.
Samayam Telugu indian it bosses will be in us to plead against visa curbs
అమెరికా వెళ్లనున్న ఇండియన్ ఐటీ సంస్థల బాసులు


ఫిబ్రవరి 20వ తేదీన అమెరికాలోని లా మేకర్స్, చట్టాలు రూపొందించడంలో కీలకమైన నేతలు, అధికార యంత్రాంగాన్ని కలిసి ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలని విరమింపచేయడానికి ప్రయత్నిస్తున్నట్టు నాస్కామ్ చీఫ్ ఆర్ చంద్రశేఖర్ తెలిపారు. అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, జారీ చేస్తున్న ఆదేశాలు ఇండియన్ ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా సిబ్బంది ఎంపిక పరంగా ఐటీ సంస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నాయి.

తాజా నియమనిబంధనల ప్రకారం.. సిబ్బంది నియామకంలో తొలి ప్రాధాన్యత అమెరికాలోని స్థానిక పౌరులకి ఇవ్వాలి. ఆ తర్వాత ప్రాధాన్యతాక్రమంలో H-1B వీసా కలిగిన వారికి అవకాశం ఇచ్చినప్పటికీ... వారికి రూల్స్ ప్రకారం అధిక వేతనం చెల్లించాలి. సరిగ్గా ఇవే రెండు అంశాలు ఇండియన్ ఐటీ కంపెనీలని ఇరుకునపడేస్తున్నాయి. అమెరికాలో ఐటీ నైపుణ్యం కలిగిన వారి సంఖ్య తక్కువగా వుండటంతో తప్పనిసరిగా విదేశీయులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఐటీ సంస్థలది.

ఫిబ్రవరి 20వ తేదీన అమెరికాలోని కీలక నేతలు, అధికారులని కలవనున్న నాస్కామ్ ప్రతినిధులు నాలుగురోజులపాటే అక్కడే పర్యటించి ఈ సమస్యకు ఓ పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేయనున్నారు. జూన్‌లో జరగనున్న ట్రంప్-నరేంద్ర మోడీ భేటీలో ఈ అంశాలు కూడా చర్చకు రానున్నాయని తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.