యాప్నగరం

భారత్‌లో ఆసియాన్ అధినేతలు: చైనా స్పందన ఇది!

రిపబ్లిక్ డే వేడుకల ముఖ్య అతిథులుగా ఆసియాన్ దేశాల అధినేతలు పాల్గొంటుండంపై చైనా స్పందించింది.

TNN 25 Jan 2018, 6:59 pm
భారత్ ఎదుగుదల తమకు ఎక్కడ ప్రతికూలంగా మారుతోందనని నిత్యం బాధపడే చైనా మన మీడియా మీద కూడా ఏడుపు మొదలుపెట్టింది. రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనడానికి ఆసియాన్ దేశాల అధినేతలు భారత్ విచ్చేసిన నేపథ్యంలో డ్రాగన్ స్పందించింది. ఈ ప్రాంతంలో శాంతి సుస్థిరతల్ని పెంచడం కోసం, అభివృద్ధి కోసం అన్ని దేశాలూ కలిసి పనిచేయాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. రిపబ్లిక్ డే వేడుకల కోసం ఏసియన్ దేశాల నేతలు భారత్ రావడం పట్ల చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చుయుంగ్ మాట్లాడారు.
Samayam Telugu indian media does not trust us china on coverage of asean leaders attending 69th republic day
భారత్‌లో ఆసియాన్ అధినేతలు: చైనా స్పందన ఇది!


చైనా నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందని హువా తెలిపారు. అన్ని దేశాలతోనూ స్నేహ సంబంధాలను కోరుకుంటున్నామని ఆమె చెప్పారు. ఆసియాన్ దేశాలతో భారత్ సంబంధాలు మెరుగుపర్చుకోవడం మాకు సమ్మతమే అని ఆమె తెలిపారు.

పైకి ఇలా మాట్లాడినా.. దక్షిణ చైనా సముద్రం విషయంలో ఇప్పటికే ఆసియాన్ దేశాలకు వివాదం ఉంది. దీంతో ఈ దేశాలతో భారత్ సంబంధాలు బలపడితే.. అది ఎక్కడ తమ ఆధిపత్యానికి ఎక్కడ గండి పడుతుందోనని చైనా భయపడుతోంది. కానీ బయటపడటం లేదు. భారత మీడియా మమ్మల్ని నమ్మడం లేదు. మా విషయంలో భారతీయ మీడియాకు విశ్వాసం లేదంటూ హువా అమాయకంగా మాట్లాడారు. రిపబ్లిక్ డే వేడుకల కవరేజ్ విషయమై ప్రశ్నించగా.. ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆసియాన్ దేశాలతో మా ఆర్థిక సంబంధాలు మెరుగవుతున్నాయి. 2020 నాటికి ఆ దేశాలతో మా వాణిజ్యం ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుతుంది. మీది గత ఏడాది 70 బిలియన్ డాలర్లే కదా అని చైనాకు చెందిన జిన్హువా వ్యాఖ్యానించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.