యాప్నగరం

White House: వైట్‌హౌస్‌పై ట్రక్కుతో దాడికి యత్నించిన తెలుగు సంతతి యువకుడు

White House అమెరికా అధ్యక్షుడు నివాసం ఉండే వైట్‌హౌస్‌ను లక్ష్యంగా చేసుకుని.. దాడికి ప్రయత్నించాడు ఓ తెలుగు సంతతి యువకుడు. నేరుగా ట్రక్కు నడుపుకుంటూ వచ్చిన అతడు.. బారికేడ్లను ఢీకొట్టి ముందుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఈ ఘటనలో ఎవరూ గాయపడక పోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. తాను అమెరికా అధ్యక్షుడ్ని చంపడానికే వచ్చినట్టు యువకుడు చెప్పాడని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. కానీ, పోలీసులు మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 24 May 2023, 9:07 am

ప్రధానాంశాలు:

  • ట్రక్కుతో దూసుకొచ్చిన భారత సంతతి యువకుడు
  • అమెరికా అధ్యక్షుడ్ని లక్ష్యంగా చేసుకున్నట్టు వెల్లడి
  • వివిధ అభియోగాలు నమోదుచేసిన పోలీసులు.
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu White House
అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం పరిసరాల్లోకి భారత సంతతికి చెందిన తెలుగు యువకుడు ట్రక్కుతో దూసుకురావడం కలకలం రేగింది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడ ఉన్న పోలీసులు తక్షణమే స్పందించి అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10 గంటల సమయంలో నాజీ జెండా ఉన్న ట్రక్కుతో వచ్చిన ఓ యువకుడు... వైట్‌హౌస్‌ ఉత్తర భాగంలోని లఫాయెట్టే పార్క్ వద్ద భద్రత నిమిత్తం ఏర్పాటు చేసిన ట్రాఫిక్‌ బారియర్స్‌ను ఢీకొట్టి ముందుకెళ్లే ప్రయత్నం చేశాడు.
అప్రమత్తమైన భద్రతా బలగాలు.. ఆ యువకుడిన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. వాహనం నడిపిన యువకుడ్ని మిస్సౌరీలోని చెస్టర్‌ఫీల్డ్‌కు చెందిన సాయి వర్షిత్ కందుకూరు (19)గా గుర్తించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను లక్ష్యంగా చేసుకుని దాడికి ప్రయత్నించినట్లు పోలీసులు వెల్లడించారు. కానీ, యువకుడు ఈ చర్యకు పాల్పడటానికి కారణాలను మాత్రం పోలీసులు పేర్కొనలేదు.


సాయివర్షిత్‌పై మారణాయుధాల వినియోగం, వాహనాన్ని నిర్లక్ష్యంగా నడపటం, దేశాధ్యక్షుడికి ప్రాణహాని కలిగించేందుకు యత్నించడం, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం తదితర అభియోగాలు నమోదు చేసినట్లు తెలిపారు..ఛెస్ట్‌ఫీల్డ్‌కు చెందిన సాయివర్షిత్‌ కందుకూరు 2022లో మార్క్వెట్‌ సీనియర్‌ హైస్కూలు నుంచి గ్రాడ్యుయేట్‌ అయినట్లుగా గుర్తించారు. ఈ ఘటన తర్వాత సమీపంలో హోటల్‌లోని కొంతమంది అతిథులను అక్కడ నుంచి ఖాళీ చేయమని అధికారులు ఆదేశించినట్టు స్థానిక మీడియా నివేదించింది.


Read More Latest International News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.