యాప్నగరం

ఇండోనేషియా భూకంపం.. 10 అంగుళాలు పైకి వచ్చిన దీవి

ఇండోనేషియాలో ఇటీవల భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం ధాటికి 400 మందికి పైగా మృత్యువాతపడ్డారు. వేలాది మంది గాయపడ్డారు. ఈ భయానక భూకంపాకానికి సంబంధించి మరో సంచలన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

Samayam Telugu 11 Aug 2018, 11:17 pm
ఇండోనేషియాలో ఇటీవల భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం ధాటికి 400 మందికి పైగా మృత్యువాతపడ్డారు. వేలాది మంది గాయపడ్డారు. వేల సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయి. అయితే ఈ భయానక భూకంపాకానికి సంబంధించి మరో సంచలన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. భూకంప తీవ్రత వల్ల ఇండోనేషియాలోని లాంబోక్ ద్వీపం 10 అంగుళాలు పైకి వచ్చిందట. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
Samayam Telugu lombok


భూకంపం తర్వాత లాంబోక్‌ ద్వీపం ఉపరితలంలో మార్పులు వచ్చినట్లు నాసా, కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు గమనించారు. శాటిలైట్‌ ఫొటోలు, ఇతర ఆధారాల ద్వారా భౌగోళిక పరిస్థితులను విశ్లేషించి సదరు ద్వీపం 10 ఇంచులు పైకి జరిగినట్లు వెల్లడించారు. ఆగస్టు 5న వచ్చిన భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న ఈ దీవి వాయవ్య ప్రాంతంలో భూ ఉపరితలం 10 అంగుళాలు (25 సెంటిమీటర్లు) పైకి వచ్చినట్లు పేర్కొన్నారు.

అయితే.. ద్వీపంలోని మరికొన్ని ప్రాంతాల్లో భూమి 2 నుంచి 6 అంగుళాల వరకూ కుంగినట్లు తెలపడం గమనార్హం. 6.9 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం కారణంగా 68 వేల ఇళ్లు ధ్వంసమయ్యాయి. 3.5 లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.